WPL 2025: ఆర్సీబీకి షాక్.. టోర్నమెంట్ నుంచి ఔట్
- డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాక్
- WPL 2025 టోర్నమెంట్ నుంచి ఔట్
- యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 12 పరుగుల తేడాతో ఓటమి
- ప్లేఆఫ్స్కు చేరుకున్న మూడు జట్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి షాక్ తగిలింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025( WPL)లో టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. శనివారం యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో టోర్నీ నుంచి ఔట్ అయింది. కాగా ఈ సీజన్లో ప్లేఆఫ్స్కు చేరుకున్న మూడు జట్లను ప్రకటించారు. అయితే, పాయింట్ల పట్టికలో ఏ జట్టు మొదటి స్థానంలో నిలిచి నేరుగా ఫైనల్ ఆడుతుందో ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్కు చేరుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, యుపీ వారియర్స్ జట్టు టోర్నమెంట్ ప్లేఆఫ్స్ రేసు నుండి నిష్క్రమించాయి.
READ ALSO: Prabhas : ‘ది రాజా సాబ్’ రిలీజ్ లేట్కి అదే కారణమా..?
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్లలో 5 గెలిచి టాప్ ప్లేస్లో ఉంది. జట్టు ఖాతాలో 10 పాయింట్లు, +0.396 నికర రన్ రేట్ ఉంది. గుజరాత్ జెయింట్స్ 7 మ్యాచ్ల్లో 4 గెలిచి రెండవ స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో 8 పాయింట్లు.. నికర రన్ రేట్ +0.334 ఉంది. ముంబై ఇండియన్స్ 6 మ్యాచ్ల్లో 4 గెలిచింది. +0.267 నికర రన్ రేట్తో మూడవ స్థానంలో ఉంది. కాగా.. నంబర్ వన్ జట్టు నేరుగా ఫైనల్ ఆడుతుంది. రెండు, మూడవ స్థానంలో ఉన్న జట్లు ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడతాయి.
READ ALSO: Virat Kohli: అరుదైన రికార్డుకు దగ్గరలో కోహ్లీ.. మాజీ దిగ్గజ ఆటగాళ్లను వెనక్కి నెట్టి..!
పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో యుపీ వారియర్స్ ఉంది. 8 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లలో మాత్రమే గెలిచింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి.. నికర రన్ రేట్ -0.624 ఉంది. ఈ టోర్నమెంట్లో మంచి ఆరంభం చేసిన డిఫెండింగ్ ఛాంపియన్.. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీంతో.. టోర్నమెంట్లో జట్టు ప్రయాణం ముగిసింది. ఏడు మ్యాచ్ల్లో కేవలం 2 మాత్రమే గెలిచింది.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!