Iran Protests: రక్తసిక్తమైన ఇరాన్! నిరసనల సెగకు 5 వేల మంది బలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Protests: ఇటీవల జరిగిన ఇరాన్ నిరసనల్లో సుమారుగా 5 వేల మంది మరణించారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు కనీసం 5 వేల మంది మరణించారని ప్రభుత్వం నిర్ధారించింది. వీరిలో దాదాపు 500 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని ఇరాన్ అధికారి ఆదివారం తెలిపారు. ఈ మరణాలకు ఉగ్రవాదులు, సాయుధ అల్లర్లే కారణమని, వారు చాలా మంది అమాయక ఇరాన్ పౌరులను చంపారని అధికారులు తెలిపారు.
READ ALSO: Himanta Biswa Sarma: పాకిస్తాన్ ఏజెంట్ ముందు అస్సాం తలవంచదు.. కాంగ్రెస్ నేత గురించేనా..
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఈ సందర్భంగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇరాన్ అధికారి మాట్లాడుతూ.. వాయువ్య ఇరాన్లోని కుర్దిష్ ప్రాంతాలలో అత్యధిక హింస, మరణాలు సంభవించాయని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కుర్దిష్ వేర్పాటువాద గ్రూపులు చురుకుగా ఉన్నాయి. నిరసనల్లో మృతి చెందిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేదని తెలిపారు. వీధుల్లోకి వచ్చిన వారికి ఇజ్రాయెల్, విదేశాలలోని సాయుధ గ్రూపుల నుంచి మద్దతు, ఆయుధాలు లభించాయని ఆరోపించారు. నిజానికి ఇరాన్లో అశాంతికి విదేశీ శక్తులే కారణమని ఇరాన్ ప్రభుత్వం తరచుగా చెబుతూ వస్తుంది.
ఇదే టైంలో అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ HRANA శనివారం మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇరాన్ నిరసనల్లో సుమారుగా 3,308 మంది మరణించారని చెప్పింది. ఇంకా 4,382 కేసులు దర్యాప్తులో ఉన్నాయని తెలిపింది. నిరసనల సందర్భంగా 24 వేల మందికి పైగా అరెస్టు అయ్యారని పేర్కొంది. నార్వేకు చెందిన ఇరానియన్ కుర్దిష్ మానవ హక్కుల సంస్థ హెంగావ్ మాట్లాడుతూ.. ఇరాన్లో డిసెంబర్ చివరలో ప్రారంభమైన నిరసనల సందర్భంగా వాయువ్యంలోని కుర్దిష్ ప్రాంతాలలో అతిపెద్ద, అత్యంత హింసాత్మక ఘర్షణలు జరిగాయని వెల్లడించింది.
నిజానికి ఇరాన్లో 19 రోజుల పాటు చెలరేగిన హింసాత్మక నిరసనల వల్ల గణనీయమైన నష్టం వాటిల్లింది. 30 ప్రావిన్సులలో సుమారు 250 మసీదులు, 20 మతపరమైన కేంద్రాలు దెబ్బతిన్నాయి. 182 అంబులెన్స్లు, అగ్నిమాపక శాఖ పరికరాలు సహా మొత్తం $5.3 మిలియన్ల నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ నిరసనల కారణంగా 317 బ్యాంకు శాఖలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 4,700 బ్యాంకులు 10% నుంచి 90% వరకు దెబ్బతిన్నాయి. 1,400 ATMలు దెబ్బతినగా, 250 పూర్తిగా పనిచేయడం మానేశాయి. విద్యుత్ రంగం $6.6 మిలియన్ల నష్టాన్ని చవిచూసింది. విద్య, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 265 పాఠశాలలు, విద్యా కేంద్రాలు, మూడు ప్రధాన గ్రంథాలయాలు, ఎనిమిది సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలు, నాలుగు సినిమాహాళ్లు దెబ్బతిన్నాయి. ఇరాన్లో 19 రోజుల నిరసనల తర్వాత ఇప్పుడు పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు సమాచారం.
READ ALSO: Champion OTT Release Date: బాక్సాఫీస్ ‘ఛాంపియన్’ ఓటీటీ డేట్ ఫిక్స్ !
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్లో టీమ్ఇండియా ఎక్స్ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!