Iran Protests: రక్తసిక్తమైన ఇరాన్! నిరసనల సెగకు 5 వేల మంది బలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Protests: ఇటీవల జరిగిన ఇరాన్ నిరసనల్లో సుమారుగా 5 వేల మంది మరణించారు. ఈ నిరసనల్లో ఇప్పటి వరకు కనీసం 5 వేల మంది మరణించారని ప్రభుత్వం నిర్ధారించింది. వీరిలో దాదాపు 500 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని ఇరాన్ అధికారి ఆదివారం తెలిపారు. ఈ మరణాలకు ఉగ్రవాదులు, సాయుధ అల్లర్లే కారణమని, వారు చాలా మంది అమాయక ఇరాన్ పౌరులను చంపారని అధికారులు తెలిపారు.
READ ALSO: Himanta Biswa Sarma: పాకిస్తాన్ ఏజెంట్ ముందు అస్సాం తలవంచదు.. కాంగ్రెస్ నేత గురించేనా..
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ఈ సందర్భంగా పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇరాన్ అధికారి మాట్లాడుతూ.. వాయువ్య ఇరాన్లోని కుర్దిష్ ప్రాంతాలలో అత్యధిక హింస, మరణాలు సంభవించాయని తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కుర్దిష్ వేర్పాటువాద గ్రూపులు చురుకుగా ఉన్నాయి. నిరసనల్లో మృతి చెందిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం లేదని తెలిపారు. వీధుల్లోకి వచ్చిన వారికి ఇజ్రాయెల్, విదేశాలలోని సాయుధ గ్రూపుల నుంచి మద్దతు, ఆయుధాలు లభించాయని ఆరోపించారు. నిజానికి ఇరాన్లో అశాంతికి విదేశీ శక్తులే కారణమని ఇరాన్ ప్రభుత్వం తరచుగా చెబుతూ వస్తుంది.
ఇదే టైంలో అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ HRANA శనివారం మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఇరాన్ నిరసనల్లో సుమారుగా 3,308 మంది మరణించారని చెప్పింది. ఇంకా 4,382 కేసులు దర్యాప్తులో ఉన్నాయని తెలిపింది. నిరసనల సందర్భంగా 24 వేల మందికి పైగా అరెస్టు అయ్యారని పేర్కొంది. నార్వేకు చెందిన ఇరానియన్ కుర్దిష్ మానవ హక్కుల సంస్థ హెంగావ్ మాట్లాడుతూ.. ఇరాన్లో డిసెంబర్ చివరలో ప్రారంభమైన నిరసనల సందర్భంగా వాయువ్యంలోని కుర్దిష్ ప్రాంతాలలో అతిపెద్ద, అత్యంత హింసాత్మక ఘర్షణలు జరిగాయని వెల్లడించింది.
నిజానికి ఇరాన్లో 19 రోజుల పాటు చెలరేగిన హింసాత్మక నిరసనల వల్ల గణనీయమైన నష్టం వాటిల్లింది. 30 ప్రావిన్సులలో సుమారు 250 మసీదులు, 20 మతపరమైన కేంద్రాలు దెబ్బతిన్నాయి. 182 అంబులెన్స్లు, అగ్నిమాపక శాఖ పరికరాలు సహా మొత్తం $5.3 మిలియన్ల నష్టాలు మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ నిరసనల కారణంగా 317 బ్యాంకు శాఖలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 4,700 బ్యాంకులు 10% నుంచి 90% వరకు దెబ్బతిన్నాయి. 1,400 ATMలు దెబ్బతినగా, 250 పూర్తిగా పనిచేయడం మానేశాయి. విద్యుత్ రంగం $6.6 మిలియన్ల నష్టాన్ని చవిచూసింది. విద్య, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 265 పాఠశాలలు, విద్యా కేంద్రాలు, మూడు ప్రధాన గ్రంథాలయాలు, ఎనిమిది సాంస్కృతిక, పర్యాటక ప్రదేశాలు, నాలుగు సినిమాహాళ్లు దెబ్బతిన్నాయి. ఇరాన్లో 19 రోజుల నిరసనల తర్వాత ఇప్పుడు పరిస్థితి ప్రశాంతంగా ఉన్నట్లు సమాచారం.
READ ALSO: Champion OTT Release Date: బాక్సాఫీస్ ‘ఛాంపియన్’ ఓటీటీ డేట్ ఫిక్స్ !
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!