India GDP Growth: భారత్కు గుడ్న్యూస్ చెప్పిన వరల్డ్ బ్యాంక్.. తగ్గేదేలే..!
India GDP Growth: భారతదేశానికి ఆర్థిక రంగంలో ఊరటనిచ్చే శుభవార్త అందింది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ దృఢంగా ముందుకు సాగుతుందని ప్రపంచ బ్యాంక్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా 2027 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనా వేయడం విశేషం. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నప్పటికీ, భారతదేశంపై వాటి ప్రభావం తక్కువగానే ఉంటుందని నివేదిక సూచించింది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థిరత్వాన్ని మరోసారి నిరూపించుకుంటోందని పేర్కొంది.
Read Also: Ranveer Singh : ధురంధర్ – 2.. రెండు వేల కోట్ల మార్క్ అందుకోవడం అసాధ్యం
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ఏప్రిల్ 2026లో విడుదల చేసిన “దక్షిణాసియా ఆర్థిక నివేదిక”లో భాగంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 6.3 శాతం నుంచి 6.6 శాతానికి పెంచింది వరల్డ్ బ్యాంక్.. అయితే, 2026 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 7.6 శాతం వృద్ధి కంటే కొంత తగ్గుదల ఉండవచ్చని కూడా హెచ్చరించింది. జీఎస్టీ రేట్ల తగ్గింపు వినియోగదారుల డిమాండ్ను పెంచే అవకాశం ఉన్నప్పటికీ, పెరుగుతున్న ప్రపంచ ఇంధన ధరలు ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచి, గృహ వ్యయ సామర్థ్యాన్ని ప్రభావితం చేయవచ్చని నివేదికలో పేర్కొంది. అదేవిధంగా, వంట ఇంధనం మరియు ఎరువులపై అధిక సబ్సిడీలు ప్రభుత్వ ఖర్చులను ప్రభావితం చేసి, వినియోగ వృద్ధి మందగించే అవకాశం ఉందని తెలిపింది.
ఇంకా, పెరుగుతున్న ప్రపంచ అనిశ్చితి, ముడిసరుకుల ధరల పెరుగుదల కారణంగా పెట్టుబడుల వృద్ధి కూడా కొంత మందగించవచ్చని హెచ్చరించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లలో అంతరాయాల వల్ల దక్షిణాసియా ప్రాంతంలో వృద్ధి 2025లో 7 శాతం నుండి 2026 నాటికి 6.3 శాతానికి తగ్గే అవకాశం ఉందని అంచనా వేసింది. కోవిడ్-19 వంటి క్లిష్ట పరిస్థితులనూ విజయవంతంగా ఎదుర్కొని వేగంగా కోలుకున్న దేశంగా భారతదేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. ఈ నేపథ్యంలో, ప్రపంచ సవాళ్ల మధ్య కూడా భారత్ ఆర్థికంగా బలంగా ముందుకు సాగుతుందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!