Woman Stoned To Death: వివాహేతర సంబంధం పెట్టుకుందని మహిళను రాళ్లతో కొట్టి చంపారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Stoned To Death: వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణపై ఒక మహిళలను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపారు. సభ్యసమాజం తలవంచుకునే ఈ అమానుష ఘటన పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఈ ఘటన లాహోర్కు 500 కిలోమీటర్ల దూరంలోని పంజాబ్లోని రాజన్పూర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. బాధితురాలిని స్వయంగా ఆమె భర్త, అతని ఇద్దరు సోదరులు కలిసి చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురిచేశారని, రాళ్లతో కొట్టి చంపారని పోలీసులు వెల్లడించారు. నేరం చేసిన తర్వాత సోదరులు పారిపోయారని, పంజాబ్, బలూచిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతంలో దాక్కున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
Also Read: Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ రాకెట్ బట్టబయలు.. కారులోనే మొబైల్ ఫోన్లు పెట్టి..
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
పరువు హత్య పేరుతో మహిళలను కొట్టిచంపిన ఘటన పాకిస్థాన్లో ఇదే మొదటిది కాదు. పాకిస్థాన్లో పరువు పేరుతో ఏటా అనేక మంది మహిళలు హత్యకు గురవుతున్నారు. మానవ హక్కుల కార్యకర్తల అభిప్రాయం ప్రకారం, పాకిస్తాన్లో ప్రతి సంవత్సరం 1,000 మంది మహిళలు గౌరవం పేరుతో చంపబడుతున్నారు. బాధితులు తమ ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకోవడం లేదా అక్రమ సంబంధం పెట్టుకోవడం ద్వారా వారి కుటుంబాలకు అవమానం, పరువు పోతోందని కారణంతో ఈ దారుణాలకు ఒడుగడుతున్నారు. వీటిలో కుటుంబ సభ్యులే ఈ తరహా హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు అధికంగా ఉండడం గమనార్హం.
కొద్దిరోజుల క్రితమే, 25 ఏళ్ల వైద్యురాలు పరువు హత్యకు గురైంది. తన సహోద్యోగిని పెళ్లి చేసుకోవాలని వైద్యురాలు అనుకోగా.. అందుకు ఆమె తండ్రి ఒప్పుకోలేదు. ఇదే విషయంలో అమీతుమీ తేల్చుకునేందుకు వైద్యశాలకు వచ్చిన ఆమె తండ్రి వాగ్వాదానికి దిగాడు. కోపంతో రెచ్చిపోయిన తండ్రి తుపాకీ తీసి కూతుర్ని కాల్చి చంపేశాడు. పాకిస్థా్న్లో మహిళల దయనీయ పరిస్థితికి ఈ పరువు హత్యలు అద్దంపడుతున్నాయని, మహిళలను రెండో తరగతి పౌరులుగా చూస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరహా దాడులు ఎక్కువ అవుతుండడంతో మహిళా భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తు్న్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!