Woman physically Abused: కర్ణాటకలోని కొప్పల్లో దారుణ ఘటన చేసుకుంది. భర్త కళ్లేదుటే ఆరుగురు వ్యక్తులు 21 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె భర్తను విచక్షణారహితం కొట్టారని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు. ఫిబ్రవరి 8, 9వ తేదీ మధ్య రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి నిందితులందరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Madhyapradesh: బుల్డోజర్తో కూల్చడం ఫ్యాషన్గా మారింది.. మధ్యప్రదేశ్ హైకోర్టు చురకలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 21 ఏళ్ల మహిళ, ఆమె భర్త ఇంటికి వెళ్లేందుకు బస్టాప్లో వేచి ఉన్నారు. ఇంట్లో గొడవల కారణంగా దంపతుల మధ్య గొడవ జరిగింది. క్రమంగా ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రరూపం దాల్చడంతో ఆ ఆరుగురు జోక్యం చేసుకున్నారు. అనంతరం వారంతా కలిసి దంపతులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వారిద్దరిని కొట్టడం ప్రారంభించారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలిసింది. ఫిబ్రవరి 9న తన ఫిర్యాదులో, వారు తనను లాగి తన భర్తను కొట్టారని ఆ మహిళ ఆరోపించింది. నిందితుల్లో ఒకరు ఆమెపై అత్యాచారం చేశాడు. వారు మహిళను చాలా వేధించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశామని, ఫిబ్రవరి 9వ తేదీన ఈ ఘటనతో సంబంధం ఉన్న ఆరుగురిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు.