Madhyapradesh: బుల్డోజర్తో కూల్చడం ఫ్యాషన్గా మారింది.. మధ్యప్రదేశ్ హైకోర్టు చురకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhyapradesh: మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఇంటి కూల్చివేత కేసులో మున్సిపల్ కార్పొరేషన్కు ఇండోర్ హైకోర్టు చురకలంటించింది. ఎవరి ఇంటినైనా కూల్చడం ఫ్యాషన్గా మారిందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. దోషులకు కోర్టు జరిమానా కూడా విధించింది. బుల్డోజర్తో ఇంటిని కూల్చిన చర్యపై హైకోర్టు ప్రశ్నలు సంధించింది. ఇండోర్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ వివేక్ రుషియా మాట్లాడుతూ.. సహజ న్యాయ సూత్రాలు పాటించకుండా ఇప్పుడు ఏ ఇంటినైనా కూల్చివేయడం ‘ఫ్యాషన్’గా మారిపోయిందని వ్యాఖ్యానించారు.
Read Also: Hemant Soren: హేమంత్కు మరోసారి ఈడీ కస్టడీ పొడిగింపు.. ఎన్నిరోజులంటే..!
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
ఉజ్జయినిలో ఓ కేసుకు సంబంధించి నిందితుడి భార్య హైకోర్టును ఆశ్రయించగా.. ఈమేరకు వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్కు చెందిన రాహుల్ లంగ్రి అనే వ్యక్తి ఓ ఆస్తి వివాదంలో ఒక వ్యక్తిని బెదిరించి అతడిపై దాడి చేశాడు. దీంతో ఆ బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో రాహుల్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. అనంతరం పోలీసులు, మున్సిపల్ అధికారులు కలిసి రాహుల్కు చెందిన రెండంతస్తుల భవనాన్ని కూలగొట్టారు. ఈ చర్యలపై రాహుల్ భార్య రాధ కోర్టును ఆశ్రయించింది.
Read Also: Ayodhya: రామమందిరంలో ఢిల్లీ, పంజాబ్ సీఎంలు పూజలు
ఈ భవనంపై చర్య తీసుకొనే సమయంలో ప్రస్తుత యజమానులకు కాకుండా గత యజమానులకే నోటీసులిచ్చారని ఆమె ఆరోపించారు. తమ గృహం అక్రమ నిర్మాణం కాదని ఆమె వాదించారు. ఆ ఇల్లు హౌసింగ్ బోర్డులో నమోదైందని.. బ్యాంకు లోన్ కూడా పొందామన్నారు. ఈ కేసుపై విచారణ అనంతరం జస్టిస్ వివేక్ రుషియా తీర్పు వెలువరించారు. ఇంటిని కూల్చివేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. రూల్స్కు విరుద్ధంగా ఇళ్లను కూల్చడం, అనంతరం వాటిని పేపర్లో పబ్లిష్ చేయించుకోవడం ఫ్యాషన్గా మారిందని జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఇంటిని కూల్చే బదులు రెగ్యులరైజ్ చేయించుకోవాలని సూచిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సహజ న్యాయ సూత్రాన్ని పాటించకుండానే కూల్చివేతలకు పాల్పడ్డారని ఉజ్జయిని అధికారులపై జస్టిస్ వివేక్ రుషియా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధకు రూ.లక్ష, ఆమె అత్త విమలా గుర్జర్కు మరో రూ.లక్ష పరిహారం కింద ఇవ్వాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే న్యాయమూర్తి తీర్పుపై బాధిత మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పుపై అప్పీలు చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!