Tragedy: చిన్న గొడవ చివరకు.. కన్న కొడుకు కళ్లముందే మహిళను..
- చిన్న గొడవ చివరకు
- కన్న కొడుకు కళ్లముందే మహిళను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ సిటీలో మహిళను నడిరోడ్డుపై హత్య చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఓ మహిళకు ఓ వ్యక్తికి మధ్య జరిగిన ఘర్షణ నేపధ్యంలో ఆమె చనిపోవడంతో పిల్లలు అనాధలుగా మిగిలారు. నిందితుడు జైలు పాలయ్యాడు. క్షణికావేశంలో చేసిన దాడిలో ఓ నిండు ప్రాణం బలైపోయింది. విశాఖలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఒక వివాహిత హత్యకు గురైంది. ఆమె నివాసానికి ఎదురు ఇంట్లో ఉండే వ్యక్తే పదునైన ఆయుధంతో గొంతుకోసి హత్య చేశాడు. కన్న కొడుకు కళ్లముందే హత్య జరగడంతో ఆ ప్రాంతంలో తీవ్రకలకలం రేపింది. అక్కయ్యపాలెం నందగిరి నగర్లో ఈ ఘటన జరిగింది.
Also Read:UK Work Visa: విద్యార్థులకు బ్రిటిష్ ప్రభుత్వం షాక్.. వర్క్ వీసా వ్యవధి తగ్గింపు..
Also Read
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
శ్రావణ సంధ్యారాణి అలియాస్ సోనూ నందగిరి నగర్లో అద్దె ఇంట్లో ఉంటోంది. ఆమెకు ఎనిమిదేళ్ల వయసు గల కవల కుమారులు ఉన్నారు. ఇద్దరూ మానసిక వైకల్యంతో పుట్టడంతో శ్రావణ సంధ్యారాణి భర్త ఆమెను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దీనిపై ప్రస్తుతం ఇద్దరి మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. శ్రావణ సంధ్యారాణి తండ్రి విశ్వేశ్వరరావు పోలీస్ శాఖలో హెడ్ కానిస్టేబుల్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత మృతిచెందాడు. తల్లి కూడా కొన్నాళ్ల క్రితం చనిపోయింది. శ్రావణ సంధ్యారాణి ఒక కుమారుడిని హాస్టల్లో చేర్పించగా, మరొక కుమారుడు ఆమెతోనే ఉంటున్నాడు.
శ్రావణ సంధ్యారాణికి, ఆమె ఎదురింట్లో ఉంటున్న కార్పెంటర్ కండిపల్లి శ్రీనివాసరావుకు కొద్దిరోజులుగా గొడవ జరుగుతోంది. 8 నెలల క్రితం తాగిన మైకంలో శ్రీనివాసరావు.. సోను స్కూటీ సీటు కవర్ కోసేశాడు. దానితో మొదలైన గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అప్పటి నుంచి ఎదురు పడినప్పుడల్లా గొడవపడే వాళ్లని స్థానికులు చెబుతున్నారు. నిన్న మధ్యాహ్నం కూడా ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. సాయంత్రం 5.15 గంటల సమయంలో శ్రావణ సంధ్యారాణి వాకింగ్కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. కొద్ది అడుగుల దూరం వెళ్లేసరికి కొండమ్మ అనే మహిళ ఎదురుపడడంతో ఆమెతో మాట్లాడుతోంది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన శ్రీనివాసరావు పదునైన ఆయుధంతో శ్రావణ సంధ్యారాణి పీక కోసేశాడు.
తీవ్రరక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది సంధ్యారాణి. ఆమెతో మాట్లాడుతున్న మహిళ ఒక్కసారిగా షాక్ అయి గట్టిగా కేకలు పెట్టింది. స్థానికులు అక్కడకు వచ్చేసరికి శ్రీనివాసరావు పరారయ్యాడు. స్థానికులు పోలీసులకి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో ఫోర్త్ టౌన్ సీఐ సీహెచ్ ఉమాకాంత్ అక్కడకు చేరుకుని 108కి ఫోన్ చేశారు. 108 సిబ్బంది వచ్చి పరిశీలించగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు నిర్ధారించారు. క్లూస్టీమ్ను రప్పించి ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు.
Also Read:Mujra Party : అమ్మాయిలతో విందులో చిందులు.. చిక్కిన నేతలు
నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానాలు ఇస్తున్నాడు. తనకు సోనుతో పరిచయం ఉందని.. అయితే తాను వేరే మహిళతో చనువుగా ఉండడం పలు మార్లు సోను ప్రశ్నించడం తనకి నచ్చలేదని ఈ నేపథ్యంలోనే గొడవ జరిగిందని పోలీసు ఎదుట చెప్పుకొచ్చాడు శ్రీనివాస్. అయితే శ్రీనివాస్ చెప్పేది వాస్తవమా కాదా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. సంధ్యారాణికి ఒక సోదరుడు ఉన్నప్పటికీ అతను అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలిసింది. నా అనేవారు ఎవరూ లేకపోవడంతో బుద్ధిమాంద్యం కలిగిన ఇద్దరు కవలల పరిస్థితి ఏమిటనేది అగమ్యగోచరంగా మారింది. వారిని తండ్రి వద్దకు చేర్చేలా పోలీసులు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
-
Lalit Modi: సచిన్, గంగూలీ, ద్రవిడ్లను నేను బ్రతిమాలుకున్నా.. లలిత్ మోడీ సంచలన వ్యాఖ్యలు!
-
Divorce Battle: భర్తపై 23 ఏళ్ల న్యాయపోరాటం.. చివరకు రూ.85 కోట్లు గెలుచుకున్న భారత సంతతికి చెందిన మహిళ
-
2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
-
Sanjosh Foundation: చిన్న హీరో, పెద్ద సహాయం.. 118 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, మరెన్నో సేవా కార్యక్రమాలు!
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..