Madhya Pradesh: అమానుషం.. మహిళను కర్రలతో కొడుతుండగా వీడియో తీస్తున్న జనాలు
- మధ్యప్రదేశ్లో అమానుష ఘటన
- ఓ మహిళను అందరూ చూస్తుండగా కర్రతో కొట్టిన నలుగురు వ్యక్తులు
- వీడియో సోషల్ మీడియాలో వైరల్
- సాయం చేయకుండా చూస్తూ ఉండిపోయిన జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లో అమానుష ఘటన వెలుగు చూసింది. ధార్ జిల్లాలో మహిళను ఓ వ్యక్తి కర్రతో అందరూ చూస్తుండగా కొడుతున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో.. నలుగురు వ్యక్తులు ఆ మహిళను పట్టుకుని ఉంటే మరొక వ్యక్తి కర్రతో వెనుక భాగాన కొడుతున్నాడు. అయితే.. ఆ మహిళ ఏం పనిచేసిందో తెలియదు కానీ.. నలుగురి చేతిలో నుంచి బయట పడేందుకు ఆమెకు ఎవరూ సాయం చేయలేదు. అంతేకాకుండా.. చూస్తూ ఫోన్లో ఈ ఘటనను రికార్డ్ చేశారు.
Read Also: Hyderabad: TGPSC ఆఫీసు వద్ద ఉద్రికత్త..!(వీడియో)
Also Read
- V.D. Satheesan: "సతీశన్ అనే నేను".. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- AP Crime: ఏపీలో దారుణం.. మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం.. నలుగురిపై కేసు నమోదు
- Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
- Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..
కాగా.. ఈ వీడియో పోలీసుల కంట పడింది. అది చూసిన పోలీసులు.. కొట్టిన వారిని, ఆ ప్రదేశాన్ని గుర్తించారు. వెంటనే నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. నూర్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా.. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇతర నిందితుల కోసం గాలిస్తున్నారు.
Read Also: NBK 109 : బాలయ్య మూవీలో కన్నడ స్టార్ నటుడు.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..
ఈ ఘటనపై.. రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ స్పందిస్తూ, “ధార్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన బీజేపీ పాలనలో మహిళల భద్రతపై మరోసారి తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. మహిళలపై అఘాయిత్యాలలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది!” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ను ట్యాగ్ చేస్తూ.. “ఈ సంఘటనపై తమకు న్యాయం జరుగుతుందని ధార్లోని ఈ సోదరీమణులు ఈ ప్రభుత్వం నుండి ఆశించగలరా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. మధ్యప్రదేశ్లో మహిళలపై వేధింపులు, నేరాలను అరికట్టడంలో మీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోంది.? అని జితు పట్వారీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Vijay Jana Nayagan : విజయ్ CM అయినా కూడా రిలీజ్ పై క్లారిటీ రాని జననాయగన్
-
V.D. Satheesan: “సతీశన్ అనే నేను”.. దశాబ్దం తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం..
-
Jayam Ravi: జయం రవి వ్యక్తిగత వివాదం ఎఫెక్ట్..నిర్మాతల్లో పెరిగిన ఆందోళన
-
Gold and Silver Rates: గోల్డ్, సిల్వర్ ధరల్లో ఇంత మార్పా?.. నేటి ధరలు ఇవే
-
Ricky Ponting-PBKS: ఒంటరిగా కూర్చుని ఏడ్చేసిన పంజాబ్ హెడ్ కోచ్.. సెటైర్లు వేసిన ఆర్ అశ్విన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..