Suicide Attempt: ఎస్పీ కార్యాలయ ఆవరణలో మహిళ ఆత్మహత్యాయత్నం.. చివరికి ఏమైందంటే..?
- యూపీలోని సంత్ కబీర్ నగర్ లో సంచలన ఘటన
- అత్యాచారం ఆరోపణలపై జైలు నుంచి వచ్చిన ఓ యువకుడు
- తనపై సామూహిక అత్యాచారం చేశాడని కేసు నమోదు చేయాలంటూ..
- ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించిన ఓ యువతి
- కాపాడిన మహిళా పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని సంత్ కబీర్ నగర్ లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యాచారం ఆరోపణలపై జైలు నుంచి వచ్చిన ఓ యువకుడు.. తనపై సామూహిక అత్యాచారం చేశాడని కేసు నమోదు చేయాలంటూ ఓ యువతి గురువారం ఎస్పీ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యకు యత్నించింది. తన వెంట తీసుకొచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకుంది. ఈ క్రమంలో మహిళా పోలీసులు వెంటనే అడ్డుకున్నారు. యువకుడిపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో యువతి శాంతించింది.
UGC-NET: డార్క్నెట్లో యూజీసీ-నెట్ ప్రశ్నాపత్నం లీక్.. పరీక్ష రద్దు తర్వాత కేంద్రం ప్రకటన..
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
- US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
- IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
వివరాల్లోకి వెళ్తే.. జూన్ 16న ఖలీలాబాద్ లోని తన స్నేహితురాలిని కలిసేందుకు వెళ్తున్నట్లు మహిళ తెలిపింది. అయితే.. 6 నెలల క్రితం ఓ యువకుడిపై యువతి అత్యాచారం కేసు పెట్టింది. ఈ క్రమంలో.. ఆ యువకుడు దారిలో అడ్డుకున్నాడు. అంతేకాకుండా.. యువతిని సిగరెట్ తో కాల్చి తన కారులోకి నెట్టాడు. అందులో ఉన్న ఓ వ్యక్తి, నిందితుడు కలిసి మరోసారి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనను గొంతు నులిమి చంపాలని అనుకున్నారని, అంతేకాకుండా తన ఫోన్ పగులగొట్టారని బాధిత మహిళ తెలిపింది. ఎలాగోలా వారి వద్ద నుంచి బయటపడినట్లు చెప్పింది. అయితే.. పోలీసులు వారిపై కేసు నమోదు చేయకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు బాధిత మహిళ పేర్కొంది.
Relationship: మీ అత్తగారు మీపై చిరాకు పడుతున్నారా.. ఇలా చేయండి..!
6 నెలల క్రితం యువతి వరకట్న వేధింపులు, అబార్షన్ పై యువకుడిపై కేసు పెట్టిందని సీఓ సదర్ బ్రజేష్ సింగ్ తెలిపారు. చర్చల సమయంలో ఆమె పెళ్లి విషయాన్ని తిరస్కరించింది. అంతేకాకుండా.. అతనిపై అత్యాచార ఆరోపణలు చేసింది. గతంతో యువతి రెండుసార్లు చనిపోయేందుకు ప్రయత్నించింది. అయితే.. గతంలో నమోదైన అత్యాచారం, పోక్సో చట్టం కేసులో యువకుడు జైలుకు వెళ్లాడు. జూన్ 7న బెయిల్ పై విడుదలయ్యాడు. కాగా.. నిందితుడు మరోసారి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాల్సిందిగా కొత్వాలి పోలీసులను ఆదేశించినట్లు ఎస్పీ సత్యజిత్ గుప్తా తెలిపారు. విచారణలో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూసినా చర్యలు తీసుకుంటామన్నారు.
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!