Live in Partner Murder: స్క్రూడ్రైవర్, సుత్తితో లివిన్ రిలేషన్ షిప్ పార్టనర్ ను హత్య చేసిన మహిళా
- ఢిల్లీ నగరంలోని భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో.
- ఓ మహిళా తన లివిన్ రిలేషన్ షిప్ పార్టనర్ ను హత్య.
- స్క్రూడ్రైవర్ & సుత్తితో హత్య చేసిన మహిళా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Live in Partner Murder: దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని భల్స్వా డెయిరీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ తన లివిన్ రిలేషన్ షిప్ పార్టనర్ ను హత్య చేసింది. అనంతరం పోలీస్ స్టేషన్కు చేరుకుని స్క్రూడ్రైవర్, సుత్తితో దాడి చేసి తన లివ్ ఇన్ పార్ట్నర్ని హత్య చేసినట్లు పోలీసులకు తెలిపి లొంగి పోయింది. దాంతో ఆ మహిళ చెప్పిన మాటలు విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పోలీసులు విచారించగా అది నిజమేనని తేలింది. పోలీసులు వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెపై హత్యతో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Read Also: IND vs NZ 2nd Test: నేటి నుంచే రెండో టెస్టు.. రాహులా, సర్ఫరాజా!
Also Read
ఇకపోతే, మృతుడు సాహిల్ (30) ప్లంబర్గా పనిచేసేవాడు. ఏడేళ్ల క్రితం సాహిల్ ఖాన్ ఈ నిందితురాలిని కలిశాడు. ఆ తర్వాత మహిళ తన భర్తను విడిచిపెట్టి 2018 నుండి సాహిల్తో కలిసి జీవించడం ప్రారంభించింది. ఇంతలో ఆమె భర్త కూడా చనిపోయాడు. తన నలుగురు పిల్లలను అత్తమామల ఇంట్లో వదిలి వెళ్లాడు. ఆ మహిళ ఏడాది క్రితమే తన పిల్లలతో కలిసి ఢిల్లీకి వచ్చింది. అలా చేసినందుకు సాహిల్ తనను వేధించేవాడని, అందుకే తనను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని అన్నట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది.
Read Also: Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఘటనాస్థలికి చేరుకున్న 15 ఫైర్ ఇంజన్లు
ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త దాడికి చోట చేసుకుంది. దింతో తొలుత సాహిల్పై స్క్రూడ్రైవర్, సుత్తి, కర్రతో దాడి చేసింది. దాంతో అతడు కిందపడిన వెంటనే ఆ మహిళ స్క్రూడ్రైవర్తో కొట్టింది. తొలుత సాహిల్పై స్క్రూడ్రైవర్, సుత్తి, కర్రతో దాడి చేసింది. అతడు కిందపడిన వెంటనే ఆ మహిళ స్క్రూడ్రైవర్తో కొట్టింది. దాంతో అతను మృతి చెందాడు. ఆ తర్వాత మహిళ మృతదేహంతో దాదాపు ఎనిమిది గంటల పాటు ఇంట్లోనే ఉండిపోయింది. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో ఆమె స్వయంగా పోలీస్ స్టేషన్కు చేరుకుని హత్య జరిగిన విషయాన్ని తెలియజేసింది. ఇన్స్పెక్టర్ మహేష్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పిల్లలను కూడా సాక్షులుగా మారుస్తామని పోలీసు అధికారి తెలిపారు. పిల్లలను వారి తాతయ్యలకు అప్పగించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!