NTV Telugu Site icon

Karnataka: ఆగని దారుణాలు.. చికిత్స కోసం వచ్చిన మహిళపై అత్యాచారం

Karnataka

Karnataka

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. దేశవ్యాప్తంగా కోల్‌కతా రేప్ ఘటనపై ఆగ్రహజ్వాలలు కనబడుతున్నప్పటికీ, మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన 65 ఏళ్ల మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.

AAY : ఏంటి.. ఆయ్ సినిమా ఇంత కలెక్ట్ చేసిందా.. వామ్మో

వివరాల్లోకి వెళ్తే.. చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 65 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గురువారం తెలిపారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 25 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది. బాధిత మహిళ వైద్యం కోసం ఆస్పత్రికి రాగా.. ఆలస్యం కావడంతో రాత్రి అక్కడే బస చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. మహిళ ఆసుపత్రి ఆవరణలో విశ్రాంతి తీసుకుంటోంది. అయితే.. ఆమెను ఒంటరిగా గుర్తించిన నిందితుడు ఇర్ఫాన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Mumbai: ముంబైలో దారుణం.. సోషల్ మీడియాలో పరిచయమైన బాలికపై అత్యాచారం

సహాయం కోసం ఆమె కేకలు వేయడంతో ఆసుపత్రిలో ఉన్న కొందరు వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను రక్షించారు. అంతేకాకుండా.. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై చిక్కబళ్లాపూర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ కుశాల్‌ చౌక్సే మాట్లాడుతూ.. మహిళ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిందని.. ఆమె ఆసుపత్రి ఆవరణలో ఉండగా ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేసి కస్టడీకి పంపామని.. భారతీయ న్యాయ సంహిత (రేప్) సెక్షన్ 64 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.