Karnataka: ఆగని దారుణాలు.. చికిత్స కోసం వచ్చిన మహిళపై అత్యాచారం
- కర్నాటకలో మరో దారుణం
- వైద్యం కోసం వచ్చిన మహిళపై ఓ కామాంధుడు అత్యాచారం
- చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఘటన
- 25 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
- బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలోని ఆర్జి కర్ ఆసుపత్రిలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలపై కామాంధులు రెచ్చిపోతున్నారు. దేశవ్యాప్తంగా కోల్కతా రేప్ ఘటనపై ఆగ్రహజ్వాలలు కనబడుతున్నప్పటికీ, మృగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన 65 ఏళ్ల మహిళపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.
AAY : ఏంటి.. ఆయ్ సినిమా ఇంత కలెక్ట్ చేసిందా.. వామ్మో
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
వివరాల్లోకి వెళ్తే.. చిక్కబళ్లాపూర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో 65 ఏళ్ల మహిళపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు గురువారం తెలిపారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన 25 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు జరిగింది. బాధిత మహిళ వైద్యం కోసం ఆస్పత్రికి రాగా.. ఆలస్యం కావడంతో రాత్రి అక్కడే బస చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో.. మహిళ ఆసుపత్రి ఆవరణలో విశ్రాంతి తీసుకుంటోంది. అయితే.. ఆమెను ఒంటరిగా గుర్తించిన నిందితుడు ఇర్ఫాన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
Mumbai: ముంబైలో దారుణం.. సోషల్ మీడియాలో పరిచయమైన బాలికపై అత్యాచారం
సహాయం కోసం ఆమె కేకలు వేయడంతో ఆసుపత్రిలో ఉన్న కొందరు వ్యక్తులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను రక్షించారు. అంతేకాకుండా.. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై చిక్కబళ్లాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుశాల్ చౌక్సే మాట్లాడుతూ.. మహిళ చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిందని.. ఆమె ఆసుపత్రి ఆవరణలో ఉండగా ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపారు. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్టు చేసి కస్టడీకి పంపామని.. భారతీయ న్యాయ సంహిత (రేప్) సెక్షన్ 64 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. విచారణ జరుపుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!