Deepika Misra: శౌర్య పురస్కారం అందుకున్న మొదటి మహిళా ఎయిర్ఫోర్స్ ఆఫీసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wing Commander Deepika Misra: వింగ్ కమాండర్ దీపికా మిశ్రాకు భారత వైమానిక దళం (IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి గురువారం వాయు సేన పతకాన్ని అందించారు. ఆమె శౌర్య పురస్కారం అందుకున్న మొదటి మహిళా ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా నిలిచారు. దేశ రాజధానిలో జరిగిన వేడుకలో గ్యాలంటరీ అవార్డు అందుకున్న 58 మంది సిబ్బందిలో ఆమె కూడా ఉన్నారు. వింగ్ కమాండర్ దీపికా మిశ్రా శిక్షణ పొందిన హెలికాప్టర్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, ఇన్స్ట్రుమెంట్-రేటెడ్ ఇన్స్ట్రక్టర్, ఎగ్జామినర్.
ఆగస్టు 2, 2021న, ఉత్తర మధ్యప్రదేశ్లో ఆకస్మిక వరదలకు ప్రతిస్పందనగా మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలను చేపట్టడానికి దీపికా మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. క్షీణిస్తున్న వాతావరణం, బలమైన గాలులు, సూర్యాస్తమయ సమయం సమీపిస్తున్నప్పటికీ దీపికా మిశ్రా విధులు నిర్వహించారు. ఆమె మహిళలు, పిల్లలతో సహా 47 మంది ప్రాణాలను కాపాడింది. సేవ పట్ల అంకితభావం గల వారు ఐఏఎఫ్ నుండి మహిళలు గతంలో అవార్డులు అందుకున్నారు, అయితే ఐఏఎఫ్ మహిళా అధికారికి గ్యాలంటరీ అవార్డును అందించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆమె ధైర్యసాహసాలు ప్రకృతి విపత్తులో విలువైన ప్రాణాలను కాపాడటమే కాకుండా వరద ప్రభావిత ప్రాంతంలోని సామాన్య ప్రజలలో సురక్షిత భావాన్ని కలిగించాయని అధికారులు తెలిపారు.
Also Read
- Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- YS Jagan: భద్రతా వైఫల్యమే ప్రమాదానికి కారణం.. ప్రమాద బాధితులకు అండగా ఉంటాం.!
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
Read Also: Ganga Pushkaralu: గంగానది పుష్కరాలకు సర్వం సిద్ధం
ఢిల్లీలో అవార్డులు అందుకున్న వారిలో జార్ఖండ్లోని దియోఘర్లోని త్రికూట్ హిల్స్ వద్ద జరిగిన రోప్వే ప్రమాదాన్ని అత్యంత కష్టతరమైన రెస్క్యూ ఆపరేషన్లలో ఒకటిగా పరిగణించిన తరువాత రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ఐఏఎఫ్ గరుడ్ యూనిట్ సిబ్బంది కూడా అవార్డు గ్రహీతలలో ఉన్నారు. అలాగే కాశ్మీర్ లోయలో తిరుగుబాటు వ్యతిరేక చర్యలో పాల్గొన్న సిబ్బంది కూడా ఉన్నారు. విశిష్ట సేవా పతకం పొందిన 30 మందిలో 29 మంది ఐఏఎఫ్కు చెందినవారు, ఒకరు ఆర్మీకి చెందిన వారని అధికారులు తెలిపారు.
కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి బ్రిగ్ జి ముత్తుకుమార్ ఐఏఎఫ్ కోసం తన సేవలకు విశిష్ట సేవా పతకాన్ని అందుకున్నారు. దళానికి చేసిన సేవలకు గాను వారెంట్ అధికారి అశోక్ కుమార్కు విశిష్ట సేవా పతకాన్ని కూడా అందజేశారు. ఐఏఎఫ్ అధికారి 15 సంవత్సరాలకు పైగా దళానికి నాయకత్వం వహించారు. గత 27 సంవత్సరాలుగా రాజ్పథ్ (ప్రస్తుతం కర్తవ్య మార్గం)లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!