Deepika Misra: శౌర్య పురస్కారం అందుకున్న మొదటి మహిళా ఎయిర్ఫోర్స్ ఆఫీసర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wing Commander Deepika Misra: వింగ్ కమాండర్ దీపికా మిశ్రాకు భారత వైమానిక దళం (IAF) చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి గురువారం వాయు సేన పతకాన్ని అందించారు. ఆమె శౌర్య పురస్కారం అందుకున్న మొదటి మహిళా ఎయిర్ఫోర్స్ ఆఫీసర్గా నిలిచారు. దేశ రాజధానిలో జరిగిన వేడుకలో గ్యాలంటరీ అవార్డు అందుకున్న 58 మంది సిబ్బందిలో ఆమె కూడా ఉన్నారు. వింగ్ కమాండర్ దీపికా మిశ్రా శిక్షణ పొందిన హెలికాప్టర్ పైలట్, క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్, ఇన్స్ట్రుమెంట్-రేటెడ్ ఇన్స్ట్రక్టర్, ఎగ్జామినర్.
ఆగస్టు 2, 2021న, ఉత్తర మధ్యప్రదేశ్లో ఆకస్మిక వరదలకు ప్రతిస్పందనగా మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యలను చేపట్టడానికి దీపికా మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. క్షీణిస్తున్న వాతావరణం, బలమైన గాలులు, సూర్యాస్తమయ సమయం సమీపిస్తున్నప్పటికీ దీపికా మిశ్రా విధులు నిర్వహించారు. ఆమె మహిళలు, పిల్లలతో సహా 47 మంది ప్రాణాలను కాపాడింది. సేవ పట్ల అంకితభావం గల వారు ఐఏఎఫ్ నుండి మహిళలు గతంలో అవార్డులు అందుకున్నారు, అయితే ఐఏఎఫ్ మహిళా అధికారికి గ్యాలంటరీ అవార్డును అందించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆమె ధైర్యసాహసాలు ప్రకృతి విపత్తులో విలువైన ప్రాణాలను కాపాడటమే కాకుండా వరద ప్రభావిత ప్రాంతంలోని సామాన్య ప్రజలలో సురక్షిత భావాన్ని కలిగించాయని అధికారులు తెలిపారు.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
Read Also: Ganga Pushkaralu: గంగానది పుష్కరాలకు సర్వం సిద్ధం
ఢిల్లీలో అవార్డులు అందుకున్న వారిలో జార్ఖండ్లోని దియోఘర్లోని త్రికూట్ హిల్స్ వద్ద జరిగిన రోప్వే ప్రమాదాన్ని అత్యంత కష్టతరమైన రెస్క్యూ ఆపరేషన్లలో ఒకటిగా పరిగణించిన తరువాత రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న ఐఏఎఫ్ గరుడ్ యూనిట్ సిబ్బంది కూడా అవార్డు గ్రహీతలలో ఉన్నారు. అలాగే కాశ్మీర్ లోయలో తిరుగుబాటు వ్యతిరేక చర్యలో పాల్గొన్న సిబ్బంది కూడా ఉన్నారు. విశిష్ట సేవా పతకం పొందిన 30 మందిలో 29 మంది ఐఏఎఫ్కు చెందినవారు, ఒకరు ఆర్మీకి చెందిన వారని అధికారులు తెలిపారు.
కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ నుంచి బ్రిగ్ జి ముత్తుకుమార్ ఐఏఎఫ్ కోసం తన సేవలకు విశిష్ట సేవా పతకాన్ని అందుకున్నారు. దళానికి చేసిన సేవలకు గాను వారెంట్ అధికారి అశోక్ కుమార్కు విశిష్ట సేవా పతకాన్ని కూడా అందజేశారు. ఐఏఎఫ్ అధికారి 15 సంవత్సరాలకు పైగా దళానికి నాయకత్వం వహించారు. గత 27 సంవత్సరాలుగా రాజ్పథ్ (ప్రస్తుతం కర్తవ్య మార్గం)లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!