Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Will Prashant Kishor Retire From Politics After Bihar Election Loss

Prashant Kishor: పాలిటిక్స్‌కు పీకే రిటైర్మెంట్ ప్రకటిస్తారా?

Published Date :November 14, 2025 , 4:26 pm
By Shiva Ganesh
Prashant Kishor: పాలిటిక్స్‌కు పీకే రిటైర్మెంట్ ప్రకటిస్తారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prashant Kishor: భారత రాజకీయాల్లో ఆధునిక చాణక్యుడిగా కీర్తిగడించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ఒకప్పుడు ఆయన ఏ పార్టీకి రాజకీయ సలహాదారుగా ఉంటే ఆ పార్టీ విజయం సాధించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అలాంటి ప్రశాంత్ కిషోర్ తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటే ఆయనకు చేదు ఫలితం ఎదురైంది.2022లో ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ (JSP) పార్టీని స్థాపించి తాజా బీహార్‌లో ఎన్నికల్లో పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ 0-5 సీట్లు గెలుస్తాయని అంచనా వేశాయి కానీ ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. ఇదే సమయంలో ఆయన పార్టీ అధికార పార్టీ ఓట్లను గణనీయంగా తగ్గిస్తుందని వచ్చిన అంచనాలు కూడా నిజం కాలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పీకే ఓటమికి కారణాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Minister Vakiti Srihari : మా పాలనపై నమ్మకంతోనే ప్రజలు ఓటు వేశారు !

Also Read

  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!
  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

పీకే మాటమీద నిలబడతాడా..
బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రశాంత్ కిషోర్ ఒక జాతీయ టీవీ జర్నలిస్టుతో మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ యునైటెడ్ 25 సీట్లకు మించి గెలవదని అన్నారు. అలా జరగకపోతే తాను పదవీ విరమణ చేస్తానని పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ఆ జర్నలిస్ట్ మళ్లీ ప్రశాంత్ కిషోర్‌ను అడిగినప్పుడు.. ఆయన మాట్లాడుతూ.. “ఈ రికార్డింగ్ ను ఉంచుకోండి. జేడీయూ 25 సీట్లకు పైగా గెలిస్తే, నేను రాజకీయాల నుంచి పదవీ విరమణ చేస్తాను” అని అన్నారు. వాస్తవానికి పీకే ఎన్నికల ముందు తన మాటలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆయన తన మాటల మీద ఎంత వరకు నిలబడతాడు అనేది తెలియాల్సి ఉంది.

జన్‌సురాజ్ పార్టీ ఓటమికి కారణాలు..

* ఈ ఎన్నికల్లో జన్‌సురాజ్ పార్టీ వైఫల్యానికి అతిపెద్ద కారణం ప్రశాంత్ కిషోర్ తేజస్వి యాదవ్‌ను సవాలు చేసి, ఆ తర్వాత వెనక్కి తగ్గడమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సంఘటన తర్వాత ప్రజలు పీకేని వ్యాపారవేత్తగా చూడటం ప్రారంభించారని చెబుతున్నారు. “బీహార్‌కు కొత్త సూర్యుడిని తీసుకువస్తానని” చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. ఆ ప్రకటనకు తనను తాను ప్రత్యామ్నాయ నాయకుడిగా స్థాపించుకునే సువర్ణావకాశాన్ని కోల్పోయాడని పేర్కొన్నారు.

* వాస్తవానికి ఈ ఎన్నికల ప్రచారంలో ప్రశాంత్ కిషోర్.. తన ప్రసంగాల్లో నరేంద్ర మోడీ, అమిత్ షా వంటి కేంద్ర నాయకులను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం మానుకున్నారు. ఒక వైపు ప్రతి ప్రతిపక్ష నాయకులు మోడీ-షాలపై విమర్శలు గుప్పిస్తుంటే ఆయన మాత్రం బీజేపీ బి-టీమ్‌గా వ్యవహరిస్తున్నారని ప్రజలు భావించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ .. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వాన్ని అనుసరించి ప్రతి సమస్యకు షా మోడీని నిందించి ఉండాలని, ఎందుకంటే ఎన్నికల్లో ఈ వ్యూహం కొంత మంచి ఫలితాలను ఇచ్చి ఉండవచ్చని పేర్కొన్నారు.

* ప్రశాంత్ కిషోర్ బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి (ఉప ముఖ్యమంత్రి), జేడీయూ నాయకుడు అశోక్ చౌదరి (మంత్రి) సహా ప్రముఖ ఎన్డీఏ నాయకులపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. అయితే ఆయన తన ఆరోపణలను విలేకరుల సమావేశానికే పరిమితం చేశారు. వాస్తవానికి ఆయన సానుకూల రాజకీయాలపై మాత్రమే తన దృష్టిని కేంద్రీకరించారు. అభివృద్ధి, విద్య, ఆరోగ్యం గురించి ప్రజలలో చర్చించినంత తీవ్రతతో అవినీతి అంశాన్ని కూడా లేవనెత్తి ఉంటే, బహుశా ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉండేవని చెబుతున్నారు.

* కుల రాజకీయాలకు పాల్పడబోమని హామీ ఇచ్చి, కులం, మతం పేరుతో టిక్కెట్లు ఇచ్చారనే విమర్శ ఆయనపై ఉంది. ప్రశాంత్ కిషోర్ తాను కుల రాజకీయాల్లో పాల్గొనని చెప్పుకున్నాడు, కానీ ఆయన దానికి పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించాడు. టిక్కెట్లు పంపిణీ చేసేటప్పుడు కులం, మతం ఆధారంగా అభ్యర్థులను వ్యక్తిగతంగా ఎంపిక చేశారనే విమర్శలు ఉన్నాయి. 2022లో JSP ని ప్రారంభించినప్పుడు, ఆయన తన పార్టీ “పారదర్శకత, అభివృద్ధి, కులరహిత రాజకీయాలకు” చిహ్నంగా ఉంటుందని పేర్కొన్నారు. కానీ ఎన్నికల్లో ఆయన తన మాటలను ఆచరణలో చూపించలేకపోయారనే విమర్శలు మూటగట్టుకున్నారు.

READ ALSO: Bihar Elections: అధికారాన్ని దూరం చేసిన అన్నదమ్ముల లొల్లి.. ఆర్జేడీని ముంచిన కుటుంబ కలహాలు!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bihar elections 2024
  • bihar politics
  • Jan Suraaj failure reasons
  • Jan Suraaj Party defeat
  • JDU seats

తాజావార్తలు

  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

  • Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్‌ పెట్టండి..!

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions