Rahul gandhi: ఆ విషయంలో మోడీ బిజీగా ఉన్నారు
- మోడీ సర్కార్పై ఎక్స్ వేదికగా రాహుల్ విమర్శలు
- రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజం
- ఎన్డీఏ సర్కార్ను కాపాడుకునే పనిలో మోడీ బిజీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమవారం 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రొటెం స్పీకర్ భర్తృహరి ఎంపీలచే ప్రమాణం చేయించారు. ఇక ఎంపీలంతా పార్లమెంట్ ఆవరణలో సందడి సందడిగా కనిపించారు. అయితే కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తొలిరోజే కేంద్రంపై ఆరోపణలు సంధించారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 15 రోజుల్లోనే పరీక్షల్లో అవకతవకలు, ఉగ్రదాడులు వంటివి చోటుచేసుకున్నాయని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని విమర్శించారు. మోడీ సర్కార్.. రాజ్యాంగంపై దాడి చేస్తోందని ధ్వజమెత్తారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Crime: బయటకు పొక్కిన గుట్టు.. వదిన, మరిది ఆత్మహత్య..
Also Read
- YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
- YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
- Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్
- YS Jagan: ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
రాజ్యాంగంపై దాడి ఆమోదయోగ్యం కాదని… రాజ్యాంగాన్ని ఏ శక్తి తాకలేదన్నారు. మేం దానిని కాపాడతామని చెప్పారు. ఈ విషయంలో మా సందేశం ప్రజల వద్దకు చేరుతోందని మీడియాతో రాహుల్ పేర్కొన్నారు. అనంతరం ‘ఎక్స్’ వేదికగా కూడా అదే సందేశాన్న ఇచ్చారు.‘‘అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే రైలు ప్రమాదాలు, కశ్మీర్లో ఉగ్రదాడులు, నీట్, యూజీసీ నెట్ పరీక్షల వివాదాలు, పాలు, గ్యాస్, టోల్ ధరల పెంపు, కార్చిచ్చులు, నీటి సంక్షోభం, వడదెబ్బ మరణాల వంటివి చోటుచేసుకున్నాయి’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: 2.70 లక్షల ఇళ్లను మంజూరు చేయండి.. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ వినతి
ఇంత జరుగుతున్నా.. ప్రధాన మంత్రి మాత్రం తన ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలో బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. బలమైన ప్రతిపక్షం కేంద్ర సర్కారుపై ఒత్తిడిని కొనసాగిస్తుందని చెప్పారు. ప్రజల తరఫున గొంతుకను వినిపించడంతోపాటు జవాబుదారీతనం లేకుండా ప్రధాని తప్పించుకోవడాన్ని అడ్డుకుంటుందని తెలిపారు. ఇదిలా ఉంటే లోక్సభ తొలి సమావేశాల ప్రారంభం వేళ ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ ప్రతిని చేతపట్టి లోక్సభ ఛాంబర్వైపు ప్రదర్శనగా వెళ్లారు.
ఇది కూడా చదవండి: Crime News: రూ.9వేల కోసం బావా బావమరిదిల మధ్య వివాదం.. ఒకరి హత్య, మరో ముగ్గురికి కత్తిపోట్లు
తాజావార్తలు
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు విజయవంతంగా పూర్తయిన సర్జరీ
-
Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
-
YS Jagan Slams AP PPP Policy: ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’లా కొత్త PPP పాలసీ.. జగన్ తీవ్ర విమర్శలు
-
IND vs SL 1st Test: తొలి టెస్టుకు శ్రీలంక జట్టు ప్రకటన.. ఊహించని ఆటగాళ్లకు చోటు.. టీమిండియాకు చుక్కలే!
-
YS Jagan: ‘డీఎస్సీలో పనిచేసే ఉద్యోగికే ఫస్ట్ ర్యాంక్’.. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. జగన్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..