Dushyant Chautala: హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్కి మద్దతు ఇస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana Govt: హర్యానా రాష్ట్రంలోని నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల ప్రయత్నానికి మద్దతు ఇవ్వడానికి బీజేపీ మిత్రపక్షం జేజేపీ సిద్ధంగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌటాలా బుధవారం నాడు ప్రకటించారు. అదే సమయంలో విప్ను ధిక్కరించి కాషాయ పార్టీ వైపు ఉండమని ఎమ్మెల్యే సహచరులకు హెచ్చరికలు ఆయన జారీ చేశారు. అయితే, గత మార్చిలో మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, స్వతంత్ర ఎమ్మెల్యే రంజిత్ సింగ్ చౌటాలా రాజీనామాలు చేయడంతో.. కొత్తగా నయాబ్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాడిన ప్రభుత్వంలో 88 మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణానికి మద్దతు ఉపసంహరించుకున్న ఒకరోజు తర్వాత చౌటాలా ప్రకటన వెల్లడించారు.
Read Also: AP Elections 2024: హైదరాబాద్ నుంచి ఏపీకి భారీగా నగదు తరలింపు.. రూ.8.39 కోట్లు సీజ్
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
కాగా, జేజేపీ జాతీయ సీనియర్ ఉపాధ్యక్షుడు దుష్యంత్ చౌటాలా హిసార్లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవడానికి బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్కు లేఖ రాస్తాను అని చెప్పుకొచ్చారు. హర్యానాలో ఫిబ్రవరి 2017లో జరిగిన గత ప్రభుత్వం నుంచి ఆరు నెలల్లోపు ఏ ప్రభుత్వంపైనా అవిశ్వాస తీర్మానం పెట్టరాదని రూల్బుక్ నిర్దేశిస్తోందన్నారు.. దాని ప్రకారం, సీఎం నయాబ్ సింగ్ సైనీ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకోవాలని లేదా వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని దుష్యంత్ చౌటాలా డిమాండ్ చేశారు.
Read Also: KCR: నేడు కరీంనగర్లో కేసీఆర్ రోడ్ షో.. తెలంగాణచౌక్ వరకు ర్యాలీ
ఇక, సంకీర్ణ ప్రభుత్వానికి ఇప్పుడు మెజారిటీకి రెండు సీట్లు తక్కువగా ఉన్నప్పటికీ తన ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని.. అది ఎలాంటి ఇబ్బంది లేకుండా తన పదవీకాలాన్ని పూర్తి చేస్తుందని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ వెల్లడించారు. కాగా, అక్టోబర్లో హర్యానాలో రాష్ట్ర ఎన్నికలు జరగనున్నాయి. సాంకేతికంగా బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతానికి సురక్షితంగా కనిపిస్తున్నప్పటికీ, ముగ్గురు ఇండిపెండెంట్లు మద్దతు ఉపసంహరించుకోవడం లోక్సభ ఎన్నికలలో పార్టీ అవకాశాలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. మే 25న రాష్ట్రంలో ఐదవ దశలో ఓటింగ్ జరగనుంది. 2019లో గెలిచిన మొత్తం 10 సీట్లను నిలబెట్టుకోవడం బీజేపీకి సవాలుగా మారింది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..