Husband seen in Reels: తప్పిపోయిన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న భార్య.. షాకిచ్చిన భర్త..
- తప్పిపోయిన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న భార్య
- రీల్స్ లో మరో మహిళతో ప్రత్యక్షమైన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మహిళ తప్పిపోయిన తన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తోంది. ఇంతలో సోషల్ మీడియాలో ఓ రీల్ చూసి షాక్ కు గురైంది. 7 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తి కోసం వెతికినా ఆచూకి లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి అకస్మాత్తుగా రీల్స్ లో ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2018 నుంచి కనిపించకుండా పోయిన సందిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటమౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లు సోషల్ మీడియాలో అకస్మాత్తుగా సజీవంగా, ఆరోగ్యంగా కనిపించాడు. అంతేకాదు పంజాబ్లోని లూథియానాలో ఓ మహిళతో రీల్స్ చేస్తూ కనిపించాడు.
Also Read:Sweeti : ఆ కారణంగానే అనుష్క బయటకు రావడం లేదా?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
మురార్ నగర్ నివాసి అయిన షీలు 2017 ఏప్రిల్ 28న, ఆమె అటమౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లును వివాహం చేసుకుంది. కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురం.. ఆ తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడం ప్రారంభించారు. విసిగిపోయిన షీలు అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ క్రమంలో జితేంద్ర కనిపించకుండాపోయాడు. 2018 ఏప్రిల్ 22న, జితేంద్ర తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెతికినా ఫలితం లేకపోయింది. షీలు, ఆమె తల్లి కుటుంబ సభ్యులు జితేంద్రను హత్య చేశారని భర్త కుటుంబం ఆరోపించింది. భార్య తన కొడుకుతో కలిసి తల్లి ఇంట్లోనే ఉండి భర్త కోసం ఎదురుచూస్తోంది.
దాదాపు 7 సంవత్సరాల తర్వాత, ఒక రోజు షీలుకి సోషల్ మీడియాలో తన భర్త రీల్స్లో పంజాబ్లోని లూథియానా వీధుల్లో మరొక మహిళతో నవ్వుతూ కనిపించాడు. జితేంద్ర తనను మోసం చేయడమే కాకుండా ఇప్పుడు వేరొకరిని కూడా వివాహం చేసుకున్నాడని షీలు పేర్కొంది. తన భర్తతో మొబైల్లో కూడా మాట్లాడానని భార్య చెప్పింది. బాధితురాలు షీలు పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో తన భర్త, అత్తమామలు కలిసి తనను ఇబ్బందులకు గురిచేసేందుకు ఈ మొత్తం కుట్ర పన్నారని తెలిపింది.
Also Read:Anushka : జయసూర్య ఫస్ట్ లుక్ ఇంప్రెస్.. అనుష్క పాత్రపై హైప్ పెంచుతున్న ‘కథనార్’
వరకట్న వేధింపుల కేసు నమోదైన వెంటనే, తన భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడని, ఆ తర్వాత తనపై హత్యానేరం మోపి అత్తమామలు తన పరువు తీయడానికి కుట్ర పన్నారని ఆమె చెప్పింది. ఇప్పుడు నిజం బయటపడిందని షీలు చెప్పింది. నా భర్త బతికే ఉన్నాడు, అతను వేరే మహిళను వివాహం చేసుకున్నాడు. నన్ను, నా కొడుకును మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో రీల్స్ వెలుగులోకి వచ్చిన తర్వాత, షీలు ఆధారాలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..