Husband seen in Reels: తప్పిపోయిన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న భార్య.. షాకిచ్చిన భర్త..
- తప్పిపోయిన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న భార్య
- రీల్స్ లో మరో మహిళతో ప్రత్యక్షమైన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మహిళ తప్పిపోయిన తన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తోంది. ఇంతలో సోషల్ మీడియాలో ఓ రీల్ చూసి షాక్ కు గురైంది. 7 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తి కోసం వెతికినా ఆచూకి లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి అకస్మాత్తుగా రీల్స్ లో ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2018 నుంచి కనిపించకుండా పోయిన సందిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటమౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లు సోషల్ మీడియాలో అకస్మాత్తుగా సజీవంగా, ఆరోగ్యంగా కనిపించాడు. అంతేకాదు పంజాబ్లోని లూథియానాలో ఓ మహిళతో రీల్స్ చేస్తూ కనిపించాడు.
Also Read:Sweeti : ఆ కారణంగానే అనుష్క బయటకు రావడం లేదా?
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
మురార్ నగర్ నివాసి అయిన షీలు 2017 ఏప్రిల్ 28న, ఆమె అటమౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లును వివాహం చేసుకుంది. కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురం.. ఆ తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడం ప్రారంభించారు. విసిగిపోయిన షీలు అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ క్రమంలో జితేంద్ర కనిపించకుండాపోయాడు. 2018 ఏప్రిల్ 22న, జితేంద్ర తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెతికినా ఫలితం లేకపోయింది. షీలు, ఆమె తల్లి కుటుంబ సభ్యులు జితేంద్రను హత్య చేశారని భర్త కుటుంబం ఆరోపించింది. భార్య తన కొడుకుతో కలిసి తల్లి ఇంట్లోనే ఉండి భర్త కోసం ఎదురుచూస్తోంది.
దాదాపు 7 సంవత్సరాల తర్వాత, ఒక రోజు షీలుకి సోషల్ మీడియాలో తన భర్త రీల్స్లో పంజాబ్లోని లూథియానా వీధుల్లో మరొక మహిళతో నవ్వుతూ కనిపించాడు. జితేంద్ర తనను మోసం చేయడమే కాకుండా ఇప్పుడు వేరొకరిని కూడా వివాహం చేసుకున్నాడని షీలు పేర్కొంది. తన భర్తతో మొబైల్లో కూడా మాట్లాడానని భార్య చెప్పింది. బాధితురాలు షీలు పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో తన భర్త, అత్తమామలు కలిసి తనను ఇబ్బందులకు గురిచేసేందుకు ఈ మొత్తం కుట్ర పన్నారని తెలిపింది.
Also Read:Anushka : జయసూర్య ఫస్ట్ లుక్ ఇంప్రెస్.. అనుష్క పాత్రపై హైప్ పెంచుతున్న ‘కథనార్’
వరకట్న వేధింపుల కేసు నమోదైన వెంటనే, తన భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడని, ఆ తర్వాత తనపై హత్యానేరం మోపి అత్తమామలు తన పరువు తీయడానికి కుట్ర పన్నారని ఆమె చెప్పింది. ఇప్పుడు నిజం బయటపడిందని షీలు చెప్పింది. నా భర్త బతికే ఉన్నాడు, అతను వేరే మహిళను వివాహం చేసుకున్నాడు. నన్ను, నా కొడుకును మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో రీల్స్ వెలుగులోకి వచ్చిన తర్వాత, షీలు ఆధారాలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!