Husband seen in Reels: తప్పిపోయిన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న భార్య.. షాకిచ్చిన భర్త..
- తప్పిపోయిన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న భార్య
- రీల్స్ లో మరో మహిళతో ప్రత్యక్షమైన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మహిళ తప్పిపోయిన తన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తోంది. ఇంతలో సోషల్ మీడియాలో ఓ రీల్ చూసి షాక్ కు గురైంది. 7 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తి కోసం వెతికినా ఆచూకి లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి అకస్మాత్తుగా రీల్స్ లో ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2018 నుంచి కనిపించకుండా పోయిన సందిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటమౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లు సోషల్ మీడియాలో అకస్మాత్తుగా సజీవంగా, ఆరోగ్యంగా కనిపించాడు. అంతేకాదు పంజాబ్లోని లూథియానాలో ఓ మహిళతో రీల్స్ చేస్తూ కనిపించాడు.
Also Read:Sweeti : ఆ కారణంగానే అనుష్క బయటకు రావడం లేదా?
Also Read
- Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
- Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
మురార్ నగర్ నివాసి అయిన షీలు 2017 ఏప్రిల్ 28న, ఆమె అటమౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లును వివాహం చేసుకుంది. కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురం.. ఆ తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడం ప్రారంభించారు. విసిగిపోయిన షీలు అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ క్రమంలో జితేంద్ర కనిపించకుండాపోయాడు. 2018 ఏప్రిల్ 22న, జితేంద్ర తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెతికినా ఫలితం లేకపోయింది. షీలు, ఆమె తల్లి కుటుంబ సభ్యులు జితేంద్రను హత్య చేశారని భర్త కుటుంబం ఆరోపించింది. భార్య తన కొడుకుతో కలిసి తల్లి ఇంట్లోనే ఉండి భర్త కోసం ఎదురుచూస్తోంది.
దాదాపు 7 సంవత్సరాల తర్వాత, ఒక రోజు షీలుకి సోషల్ మీడియాలో తన భర్త రీల్స్లో పంజాబ్లోని లూథియానా వీధుల్లో మరొక మహిళతో నవ్వుతూ కనిపించాడు. జితేంద్ర తనను మోసం చేయడమే కాకుండా ఇప్పుడు వేరొకరిని కూడా వివాహం చేసుకున్నాడని షీలు పేర్కొంది. తన భర్తతో మొబైల్లో కూడా మాట్లాడానని భార్య చెప్పింది. బాధితురాలు షీలు పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో తన భర్త, అత్తమామలు కలిసి తనను ఇబ్బందులకు గురిచేసేందుకు ఈ మొత్తం కుట్ర పన్నారని తెలిపింది.
Also Read:Anushka : జయసూర్య ఫస్ట్ లుక్ ఇంప్రెస్.. అనుష్క పాత్రపై హైప్ పెంచుతున్న ‘కథనార్’
వరకట్న వేధింపుల కేసు నమోదైన వెంటనే, తన భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడని, ఆ తర్వాత తనపై హత్యానేరం మోపి అత్తమామలు తన పరువు తీయడానికి కుట్ర పన్నారని ఆమె చెప్పింది. ఇప్పుడు నిజం బయటపడిందని షీలు చెప్పింది. నా భర్త బతికే ఉన్నాడు, అతను వేరే మహిళను వివాహం చేసుకున్నాడు. నన్ను, నా కొడుకును మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో రీల్స్ వెలుగులోకి వచ్చిన తర్వాత, షీలు ఆధారాలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
-
Shreyas Iyer Record: వరుస ఓటములు ఎదురైనా.. శ్రేయస్ అయ్యర్ ఖాతాలో అరుదైన ఘనత!
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..