Husband seen in Reels: తప్పిపోయిన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న భార్య.. షాకిచ్చిన భర్త..
- తప్పిపోయిన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న భార్య
- రీల్స్ లో మరో మహిళతో ప్రత్యక్షమైన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మహిళ తప్పిపోయిన తన భర్త కోసం ఏడేళ్లుగా ఎదురుచూస్తోంది. ఇంతలో సోషల్ మీడియాలో ఓ రీల్ చూసి షాక్ కు గురైంది. 7 సంవత్సరాల క్రితం తప్పిపోయిన వ్యక్తి కోసం వెతికినా ఆచూకి లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పుడు అదే వ్యక్తి అకస్మాత్తుగా రీల్స్ లో ఓ మహిళతో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2018 నుంచి కనిపించకుండా పోయిన సందిలా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటమౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లు సోషల్ మీడియాలో అకస్మాత్తుగా సజీవంగా, ఆరోగ్యంగా కనిపించాడు. అంతేకాదు పంజాబ్లోని లూథియానాలో ఓ మహిళతో రీల్స్ చేస్తూ కనిపించాడు.
Also Read:Sweeti : ఆ కారణంగానే అనుష్క బయటకు రావడం లేదా?
Also Read
- WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- Rohit Sharma: ఆర్సీబీలోకి రోహిత్ శర్మ? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెడ్ జెర్సీ ఫొటో.. ఇక్కడే అసలైన ట్విస్ట్!
- India-Iran Trade: ఇరాన్తో చమురు వ్యాపారం.. 4 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు
మురార్ నగర్ నివాసి అయిన షీలు 2017 ఏప్రిల్ 28న, ఆమె అటమౌ గ్రామానికి చెందిన జితేంద్ర కుమార్ అలియాస్ బబ్లును వివాహం చేసుకుంది. కొంతకాలం బాగానే సాగిన వీరి కాపురం.. ఆ తర్వాత అదనపు కట్నం కోసం అత్తింటి వారు వేధించడం ప్రారంభించారు. విసిగిపోయిన షీలు అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఈ క్రమంలో జితేంద్ర కనిపించకుండాపోయాడు. 2018 ఏప్రిల్ 22న, జితేంద్ర తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెతికినా ఫలితం లేకపోయింది. షీలు, ఆమె తల్లి కుటుంబ సభ్యులు జితేంద్రను హత్య చేశారని భర్త కుటుంబం ఆరోపించింది. భార్య తన కొడుకుతో కలిసి తల్లి ఇంట్లోనే ఉండి భర్త కోసం ఎదురుచూస్తోంది.
దాదాపు 7 సంవత్సరాల తర్వాత, ఒక రోజు షీలుకి సోషల్ మీడియాలో తన భర్త రీల్స్లో పంజాబ్లోని లూథియానా వీధుల్లో మరొక మహిళతో నవ్వుతూ కనిపించాడు. జితేంద్ర తనను మోసం చేయడమే కాకుండా ఇప్పుడు వేరొకరిని కూడా వివాహం చేసుకున్నాడని షీలు పేర్కొంది. తన భర్తతో మొబైల్లో కూడా మాట్లాడానని భార్య చెప్పింది. బాధితురాలు షీలు పోలీసులకు ఇచ్చిన దరఖాస్తులో తన భర్త, అత్తమామలు కలిసి తనను ఇబ్బందులకు గురిచేసేందుకు ఈ మొత్తం కుట్ర పన్నారని తెలిపింది.
Also Read:Anushka : జయసూర్య ఫస్ట్ లుక్ ఇంప్రెస్.. అనుష్క పాత్రపై హైప్ పెంచుతున్న ‘కథనార్’
వరకట్న వేధింపుల కేసు నమోదైన వెంటనే, తన భర్త ఇల్లు వదిలి వెళ్లిపోయాడని, ఆ తర్వాత తనపై హత్యానేరం మోపి అత్తమామలు తన పరువు తీయడానికి కుట్ర పన్నారని ఆమె చెప్పింది. ఇప్పుడు నిజం బయటపడిందని షీలు చెప్పింది. నా భర్త బతికే ఉన్నాడు, అతను వేరే మహిళను వివాహం చేసుకున్నాడు. నన్ను, నా కొడుకును మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో రీల్స్ వెలుగులోకి వచ్చిన తర్వాత, షీలు ఆధారాలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తాజావార్తలు
-
Nokia 300 Charge: నోకియా 300 Charge ఫీచర్ ఫోన్ వచ్చేసింది.. 10W రివర్స్ ఛార్జింగ్, 3,700mAh బ్యాటరీతో!
-
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. ఇక మీ అకౌంట్కు డబుల్ ప్రొటెక్షన్!
-
Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
-
The Vvaan: అడవిలో ఆ రహస్యం ఏంటి?.. ఒళ్ళు గగుర్పొడిచేలా తమన్నా, సిద్ధార్థ్ ‘ది వ్వాన్’ టీజర్ ..
-
Redmi 17C 5G: రెడ్ మీ 17C 5G విడుదల.. 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!