Karnataka: ఇద్దరు పిల్లలు.. కట్ చేస్తే హిజ్రాగా మారాడు! విషయం తెలిసి మూర్ఛపోయిన భార్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Missing man found living as Transgender in Karnataka: అతడికి పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అప్పుల బాధ ఎక్కువైపోయిందంటూ కుటుంబంను వదిలి పారిపోయాడు.. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేకపోయింది.. కట్ చేస్తే హిజ్రాగా మారిన భర్తను చూసి భార్య మూర్ఛపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని రామనగరలో చోటుచేసుకుంది. కనిపించకుండా పోయిన కేసు పరిష్కారం కావడంతో పోలీసులు కేసు క్లోజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని రామనగరకు చెందిన లక్ష్మణరావుకు 2015లో వివాహం అయింది. రెండేళ్లలో అతడి భార్య ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. ఓ చికెన్ సెంటర్లో పని చేసే లక్ష్మణరావు.. అప్పుల బాధ ఎక్కువైపోయిందంటూ 2017లో ఇల్లు వదిలి పోయాడు. తన భర్త ఇంటికి రాకపోవడంతో లక్ష్మణరావు భార్య ఐజూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఎంత వెతికినా.. లక్ష్మణరావు ఆచూకీ తెలియలేదు. తల్లిదండ్రుల సహకారంతో ఆమె తన ఇద్దరు పిల్లలతో జీవనం కొనసాగిస్తోంది. ఇటీవల కన్నడ బిగ్బాస్ షోకు సంబంధించిన వీడియోలను టీవీలో చూస్తున్న సమయంలో లక్ష్మణరావు భార్యకు ఒక వ్యక్తిని చూసి అనుమానం వచ్చింది. వీడియోలను ఫోన్లో పరిశీలించగా.. తన భర్త రూపంలోనే ఓ హిజ్రా ఉన్నట్లు గుర్తించింది. వెంటనే ఐజూరు పోలీసులకు ఆమె విషయం చెప్పింది.
Also Read
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
Also Read: IND vs ENG: విశాఖ టెస్ట్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! రజత్ పటీదార్ అరంగేట్రం
కన్నడ బిగ్బాస్ షోలో నీతు వనజాక్షి అనే హిజ్రా పాల్గొంది. ఎలిమినేట్ అయ్యాక ఆమెకు మైసూరులో హిజ్రా సంఘం స్వాగతం పలికింది. రష్మిక అనే హిజ్రా తీసిన రీల్స్లో లక్ష్మణరావును పోలిన ఓ హిజ్రా ఉంది. ఆ వీడియో ద్వారా ఐజూరు పోలీసులు రష్మికను సంప్రదించి.. వీడియోలో కనిపించిన వ్యక్తి సమాచారం తెలుసుకున్నారు. ఆమె పేరు విజయలక్ష్మి అని రష్మిక తెలిపింది. అడ్రెస్ తెలుసుకున్న పోలీసులు విజయలక్ష్మిని పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. తాను లక్ష్మణరావును కాదని.. విజయలక్ష్మిని అని వాదించాడు. విజయలక్ష్మి ఒంటిపై ఉన్న పుట్టుమచ్చలు, ఇతర చిహ్నాలను భార్య గుర్తు పట్టింది. దాంతో తానే లక్ష్మణరావును అని, లింగ మార్పిడి చేయించుకున్నానని చెప్పాడు. ఆ మాటలు విన్న భార్య మూర్ఛపోయింది. చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. తనకు కుటుంబం కన్నా.. హిజ్రా జీవితమే బాగుందని లక్ష్మణరావు అలియాస్ విజయలక్ష్మి చెప్పాడు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
-
Komatireddy Rajgopal Reddy : నేను పదవులు అడుక్కోను, నేనొక ఫైటర్ను
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!