రాజస్థాన్లోని బలోత్రాలో ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గిడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్వా గ్రామంలో, ఓ భార్య తన ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న భర్తను గొంతు నులిమి హత్య చేసింది. పోలీసులు నిందితులైన భార్య, ప్రియుడు ఇద్దరినీ అరెస్టు చేశారు. అసలు విషయం ఏమిటంటే, మూడేళ్ల క్రితం, మాల్వా గోయలన్లోని మేఘ్వాల్ నివాసి, పెమారం కుమారుడైన మృతుడు మహేంద్ర కుమార్ (21)కు, బగుండి నివాసి అయిన అను దేవితో వివాహం జరిగింది. ఈ పెళ్లి అను దేవికి ఇష్టం లేదు. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. భార్య చాలా వరకు తన పుట్టింట్లోనే ఉండేది.
Also Read:Aakash Chopra: “మీరు ఎంత కొట్టినా ఓడిపోవడం పక్కా”.. SRHను ఎగతాళి చేసిన మాజీ కేకేఆర్ స్టార్
పెళ్లికి ముందు అనుదేవి తిలవారాకు చెందిన చెనారామ్ మేఘ్వాల్ కుమారుడైన అమరారామ్ అనే ఉపాధ్యాయుడితో స్నేహం ఆ తర్వాత ప్రేమించుకున్నారు. అమరారామ్ చిడియా ప్రాంతంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తుంటాడు. అను, ఆ ఉపాధ్యాయుడు గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి తర్వాత, అనుకి, ఆమె భర్తకి మధ్య రోజూ గొడవ జరుగుతూ ఉండేది. దానిపై చాలాసార్లు పంచాయతీలు కూడా జరిగాయి. పంచాయతీల తర్వాత అను తన అత్తగారింటికి వచ్చింది, కానీ అక్కడికి వచ్చిన రెండు రోజులకే ఆమె తన ప్రియుడు అమరారామ్కి ఫోన్ చేసింది.
Also Read:Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్చల్.. ఒకరి బలి
ప్రియుడిని పిలిపించుకుని గాఢ నిద్రలో ఉన్న మహేంద్రను గొంతు నులిమి చంపేశారు. ఉదయం మహేంద్ర నిద్ర లేవకపోవడంతో తల్లి గదిలోకి వెళ్లిచూసింది. అచేతనంగా మహేంద్ర పడి ఉండడం, శరీరం, మెడపై గీతలు ఉండటాన్ని గమనించిన ఆమెకు అనుమానం కలిగింది. అప్పుడు మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఉపాధ్యాయుడు అమరారామ్ను, మృతుడి భార్య అనును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా ఇద్దరూ మహేంద్రను గొంతు నులిమి చంపినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. పోస్ట్మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
