NTV Telugu Site icon

Extra Marital Affair: హృదయవిదారకం.. నర్సుతో పెళ్లి కోసం భార్య హత్య, ప్రేమించి పెళ్లాడిన ఇల్లాలినే..

Extra Marital Affair

Extra Marital Affair

Extra Marital Affair: వివాహేతర సంబంధాల కారణంగా ఎన్ని కాపురాలు కూలిపోయాయో అందరికీ తెలుసు. అయినా ప్రజల్లో మార్పు రావడం లేదు. రెండు నిమిషాల మోజు కోసం అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. తమ పచ్చని సంసారాల్ని తామే నిప్పు పెట్టేసుకుంటున్నారు. తాజాగా వేరే మహిళను పెళ్లి చేసుకునేందుకు ఓ వ్యక్తి తన మొదటి భార్యను కిరాతకంగా హత్యచేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. మొదటి భార్యకు ప్రాణాంతకమైన ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి హతమార్చాడు. తన భార్యనే ప్రాణాంతక సూదులతో హత్య చేసిన నిందితుడు స్వప్నిల్‌ సావంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Shraddha Walker Case: శ్రద్ధ హత్య కేసులో మరో ట్విస్ట్.. ముక్కలు చేసి చంపేస్తాడని 2020లోనే ఫిర్యాదు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. స్వప్నిల్ సావంత్, ప్రియాంక అనే యువతిని కొన్నేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. స్వప్నిల్‌ ఓ ప్రైవేట్ ఆస్పత్రి పని చేస్తుండగా.. ఆ సమయంలో అదే ఆస్పత్రిలో పని చేస్తున్న ఓ నర్సుతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఆమెపై ప్రేమకు దారితీసింది. ఎలాగైనా ఆమెను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే అప్పటికే అతనికి ప్రియాంకతో వివాహం జరిగింది. తన రెండో పెళ్లికి మొదటి భార్య అడ్డుగా ఉందని భావించిన అతను.. ఎలాగైనా ప్రియాంకను హతమార్చాలని ప్లాన్‌ చేసుకున్నాడు. బీపీ, షుగర్ చికిత్స అని చెప్పి.. తాను పనిచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఎవరికీ తెలియకుండా ప్రమాదకరమైన ఇంజెక్షన్లను భార్యకు ఇచ్చాడు. వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతిని ప్రియాంక ప్రాణాలు కోల్పోయింది. అనుమానం వచ్చిన ప్రియాంక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. అతనే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలుసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టారు.