IPL 2025: రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ను విడిచిపెట్టడానికి కారణమిదే..?
- ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రిషబ్ పంత్ విడుదల
- పంత్ విడుదలపై ఓ ఇంట్రస్టింగ్ న్యూస్
- ఢిల్లీ జట్టు రిటెన్షన్ లిస్ట్లో అక్షర్ పటేల్ మొదటి ఎంపిక
- జీహెంఆర్ గ్రూప్ తీసుకున్న నిర్ణయాలపై పంత్ అసంతృప్తిగా ఉన్నట్లు నివేదిక వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రిషబ్ పంత్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఫ్రాంచైజీ పంత్ను విడుదల చేయడంతో 2020 ఫైనలిస్ట్లతో పంత్ తొమ్మిదేళ్ల అనుబంధం ముగిసింది. కాగా.. ఢిల్లీ జట్టు రిటెన్షన్ లిస్ట్లో అక్షర్ పటేల్ మొదటి ఎంపికగా ఉన్నారు. అయితే.. సహ-యజమాని జీహెంఆర్ (GMR) గ్రూప్ తీసుకున్న నిర్ణయాలపై పంత్ అసంతృప్తిగా ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. జీహెంఆర్ గ్రూప్ తదుపరి రెండేళ్లపాటు ఫ్రాంచైజీని నిర్వహిస్తుంది. జీహెంఆర్ గ్రూప్ ఇటీవల కోచింగ్ సిబ్బందిలో కూడా మార్పులు చేసింది.
Read Also: IND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. చెలరేగిన టీమిండియా స్పిన్నర్లు
Also Read
హేమాంగ్ బదానీని హెడ్ కోచ్గా, వేణుగోపాల్ రావును జట్టు డైరెక్టర్గా నియమించాలనే నిర్ణయంపై పంత్ అసంతృప్తిగా ఉన్నారు. అంతే కాకుండా.. జీఎంఆర్ గ్రూప్ తన స్వేచ్ఛను అడ్డుకోవడంపై కూడా పంత్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. పంత్ నుంచి కెప్టెన్సీని తప్పించి అక్షర్ పటేల్కు అప్పగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆలోచిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. 2016 మెగా వేలంలో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. గత రెండు మెగా వేలంలో అతడిని రిలీజ్ చేయలేదు. గత మెగా వేలంలో పంత్ ఫ్రాంచైజీతో వేలం టేబుల్ వద్ద కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం కనిపించింది. కాగా.. JSW గ్రూప్, GMR గ్రూప్ మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ 50-50 శాతం వాటాను కలిగి ఉంది. ప్రతి గ్రూప్ రెండు సంవత్సరాల పాటు ఫ్రాంచైజీని నడుపుతుంది. 2025, 2026 ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ GMR గ్రూప్ కింద ఉంటుంది.. ఆ గ్రూప్ దర్శకత్వంలో ఆడుతుంది.
Read Also: Amaran: రెండు రోజుల్లో దళపతి ‘గోట్’ కలెక్షన్ రికార్డును బద్దలు కొట్టిన అమరన్?
జీఎంఆర్ గ్రూప్ నిర్ణయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రికీ పాంటింగ్ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. పాంటింగ్ ఏడేళ్లపాటు జట్టుకు ప్రధాన కోచ్గా పని చేశారు. అంతేకాకుండా.. టీమిండియా డైరెక్టర్గా ఉన్న వెటరన్ క్రికెటర్ సౌరవ్ గంగూలీని కూడా తొలగించారు. ఈ మార్పులు పంత్ను అసంతృప్తికి గురి చేశాయి.. దీంతో వేలంలో వేరే ఫ్రాంచైజీకి ఆడాలని నిర్ణయించుకున్నాడు. కాగా.. రిషబ్ పంత్ ఈ ఏడాది టీమిండియాకు టీ20 ప్రపంచ కప్ను గెలిపించిన ఆటగాళ్లలో ఉన్నాడు.
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!