Stock Market : ఫారిన్ ఇన్వెస్టర్ల ‘క్విట్ ఇండియా ప్రచారం’ జనవరిలోనే ఎందుకు మొదలవుతుంది ?
- స్టాక్ మార్కెట్లో క్విట్ ఇండియా ప్రచారం
- పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు
- గత నాలుగేళ్లుగా జనవరిలో ఇదే ట్రెండ్
Stock Market : విదేశీ పెట్టుబడిదారులు జనవరి నెలలో స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుండి రూ.22 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. దీని కారణంగా స్టాక్ మార్కెట్లో అతి పెద్ద క్షీణత కనిపించింది. అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే విదేశీ పెట్టుబడిదారుల ‘క్విట్ ఇండియా ప్రచారం’ జనవరి నెలలోనే ఎందుకు ప్రారంభమవుతుంది? గత కొన్ని సంవత్సరాల డేటాను చెక్ చేయగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత నాలుగేళ్లుగా అంటే 2022 నుండి 2025 వరకు జనవరి నెలలో స్టాక్ మార్కెట్ నుండి విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడి ఉపసంహరణలు కొనసాగుతూనే ఉన్నాయి. 2021 సంవత్సరంలో చివరిసారిగా విదేశీ పెట్టుబడిదారులు జనవరి నెలలో స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టారు. ఈసారి విదేశీ పెట్టుబడిదారులు 2021 సంవత్సరం రికార్డును బద్దలు కొట్టగలరని.. దాదాపు రూ.35 వేల కోట్లు ఉపసంహరించుకోగలరని అంచనా.
Read Also:Vidyasagar Rao: అప్పుడు నాకోసం 5 గురు సీఎంలు వేయిట్ చేశారు.. ఇప్పుడు రేవంత్ను రిసీవ్ చేసుకున్నా..
Also Read
ఈ నెలలో ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్ల నుండి విదేశీ ఇన్వెస్టర్లు రూ.22,194 కోట్లు ఉపసంహరించుకున్నారు. కంపెనీల బలహీనమైన త్రైమాసిక ఫలితాలు, డాలర్ బలోపేతం, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో సుంకాల యుద్ధం తీవ్రతరం అవుతుందనే భయాల మధ్య వాళ్లు తమ షేర్లను విక్రయిస్తున్నారు. డిసెంబర్ నెలలో ముందుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ.15,446 కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రపంచ, దేశీయ రంగాలలో ఎదురుగాలుల మధ్య, విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్లకు తమ ఎక్స్పోజర్ను తగ్గించుకున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు (జనవరి 10 వరకు) విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు షేర్ల నుండి రూ.22,194 కోట్లు ఉపసంహరించుకున్నారు. జనవరి 2 మినహా అన్ని ట్రేడింగ్ సెషన్లలో వాళ్లు నికర అమ్మకందారులుగా ఉన్నారు.
Read Also:The Family Man 3 : విడుదలకు సిద్ధమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’
2022 సంవత్సరం నుండి ఒక ప్రత్యేక ట్రెండ్ కనిపిస్తోంది. అంటే, జనవరి నెలలో విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ను వదిలి వెళ్తున్నారు. 2022 సంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే, విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుండి రూ.33,303 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత, 2023 సంవత్సరంలో ఈ సంఖ్య రూ.28,852 కోట్లుగా కనిపించింది. ఈ ధోరణి 2024 సంవత్సరంలోనూ కొనసాగింది. స్టాక్ మార్కెట్ నుండి రూ.25,744 కోట్లు ఉపసంహరించబడ్డాయి. 2022 సంవత్సరంలో గరిష్ట మొత్తంలో డబ్బు ఉపసంహరించుకోవడం గమనించదగ్గ విషయం. ఆ తరువాత ఈ మొత్తం ప్రతి సంవత్సరం జనవరి నెలలో తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే.. జనవరి నెలలో సగం కూడా గడిచిపోలేదు. ఇప్పటికే రూ.22,194 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈసారి విదేశీ పెట్టుబడులు రూ.35 వేల కోట్లకు పైగా చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది 2022 సంవత్సరం సంఖ్యను బద్దలు కొడుతుంది.
తాజావార్తలు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
-
OnePlus Realme Merger: విలీనం కానున్న వన్ప్లస్, రియల్మీ..!?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!