Stock Market : ఫారిన్ ఇన్వెస్టర్ల ‘క్విట్ ఇండియా ప్రచారం’ జనవరిలోనే ఎందుకు మొదలవుతుంది ?
- స్టాక్ మార్కెట్లో క్విట్ ఇండియా ప్రచారం
- పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు
- గత నాలుగేళ్లుగా జనవరిలో ఇదే ట్రెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Stock Market : విదేశీ పెట్టుబడిదారులు జనవరి నెలలో స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ నుండి రూ.22 వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. దీని కారణంగా స్టాక్ మార్కెట్లో అతి పెద్ద క్షీణత కనిపించింది. అతిపెద్ద ప్రశ్న ఏమిటంటే విదేశీ పెట్టుబడిదారుల ‘క్విట్ ఇండియా ప్రచారం’ జనవరి నెలలోనే ఎందుకు ప్రారంభమవుతుంది? గత కొన్ని సంవత్సరాల డేటాను చెక్ చేయగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత నాలుగేళ్లుగా అంటే 2022 నుండి 2025 వరకు జనవరి నెలలో స్టాక్ మార్కెట్ నుండి విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడి ఉపసంహరణలు కొనసాగుతూనే ఉన్నాయి. 2021 సంవత్సరంలో చివరిసారిగా విదేశీ పెట్టుబడిదారులు జనవరి నెలలో స్టాక్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టారు. ఈసారి విదేశీ పెట్టుబడిదారులు 2021 సంవత్సరం రికార్డును బద్దలు కొట్టగలరని.. దాదాపు రూ.35 వేల కోట్లు ఉపసంహరించుకోగలరని అంచనా.
Read Also:Vidyasagar Rao: అప్పుడు నాకోసం 5 గురు సీఎంలు వేయిట్ చేశారు.. ఇప్పుడు రేవంత్ను రిసీవ్ చేసుకున్నా..
Also Read
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
ఈ నెలలో ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్ల నుండి విదేశీ ఇన్వెస్టర్లు రూ.22,194 కోట్లు ఉపసంహరించుకున్నారు. కంపెనీల బలహీనమైన త్రైమాసిక ఫలితాలు, డాలర్ బలోపేతం, డొనాల్డ్ ట్రంప్ పరిపాలనలో సుంకాల యుద్ధం తీవ్రతరం అవుతుందనే భయాల మధ్య వాళ్లు తమ షేర్లను విక్రయిస్తున్నారు. డిసెంబర్ నెలలో ముందుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో రూ.15,446 కోట్లు పెట్టుబడి పెట్టారు. ప్రపంచ, దేశీయ రంగాలలో ఎదురుగాలుల మధ్య, విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్లకు తమ ఎక్స్పోజర్ను తగ్గించుకున్నారు. ఈ నెలలో ఇప్పటివరకు (జనవరి 10 వరకు) విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు షేర్ల నుండి రూ.22,194 కోట్లు ఉపసంహరించుకున్నారు. జనవరి 2 మినహా అన్ని ట్రేడింగ్ సెషన్లలో వాళ్లు నికర అమ్మకందారులుగా ఉన్నారు.
Read Also:The Family Man 3 : విడుదలకు సిద్ధమైన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’
2022 సంవత్సరం నుండి ఒక ప్రత్యేక ట్రెండ్ కనిపిస్తోంది. అంటే, జనవరి నెలలో విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ను వదిలి వెళ్తున్నారు. 2022 సంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే, విదేశీ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ నుండి రూ.33,303 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత, 2023 సంవత్సరంలో ఈ సంఖ్య రూ.28,852 కోట్లుగా కనిపించింది. ఈ ధోరణి 2024 సంవత్సరంలోనూ కొనసాగింది. స్టాక్ మార్కెట్ నుండి రూ.25,744 కోట్లు ఉపసంహరించబడ్డాయి. 2022 సంవత్సరంలో గరిష్ట మొత్తంలో డబ్బు ఉపసంహరించుకోవడం గమనించదగ్గ విషయం. ఆ తరువాత ఈ మొత్తం ప్రతి సంవత్సరం జనవరి నెలలో తగ్గుతూ వచ్చింది. ప్రస్తుత సంవత్సరం గురించి మాట్లాడుకుంటే.. జనవరి నెలలో సగం కూడా గడిచిపోలేదు. ఇప్పటికే రూ.22,194 కోట్లు ఉపసంహరించుకున్నారు. ఈసారి విదేశీ పెట్టుబడులు రూ.35 వేల కోట్లకు పైగా చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది 2022 సంవత్సరం సంఖ్యను బద్దలు కొడుతుంది.
తాజావార్తలు
-
Chit Fund Fraud : చిట్టీల పేరుతో రూ.5 కోట్ల టోపీ.. వ్యాపారికి జైలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!