Europe : ప్రజల పాలిట శాపంగా నాలుగు పరిశ్రమలు.. ప్రతిరోజూ 7000 మంది మృతి
- చెడు ఆహారపు అలవాట్లతో ఐరోపాలో 27లక్షలమంది మృతి
- ఈ మరణాలకు మద్యం పొగాకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ శిలాజ ఇంధనం కంపెనీలే కారణం
- కఠినమైన చట్టాలను అమలు చేయాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Europe : ఐరోపా ప్రజలలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల కలిగే హాని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన నివేదికను షేర్ చేసింది. నాలుగు రకాల పరిశ్రమల గురించి నివేదికలో చాలా ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. మద్యం, పొగాకు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, శిలాజ ఇంధనం ఈ నాలుగు పరిశ్రమలు ఐరోపాలో 27 లక్షల మరణాలకు కారణమయ్యాయని ఈ నివేదికలో పేర్కొంది.
‘ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోప్ ప్రాంతంలో నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ కమర్షియల్ డిటర్మినెంట్స్'(‘Commercial Determinants of Non Communicable Diseases in WHO Europe Region’) అనే ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలు ఈ పరిశ్రమలను ఆపడానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలని పిలుపునిచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ రీజియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే ఒక ప్రకటనలో, “ఈ నాలుగు పరిశ్రమలు ఐరోపాలోని 53 దేశాలలో ప్రతిరోజూ కనీసం 7 వేల మందిని చంపుతున్నాయి.” అని పేర్కొన్నారు.
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
Read Also:TG TET 2024 Results: టీజీ టెట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ఈ నాలుగు పరిశ్రమలు ప్రజా విధానాలను అడ్డుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది. అంతేకాకుండా తప్పుడు ప్రకటనలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, సైన్స్ను అపహాస్యం చేయడం వంటి ఆరోపణలు చేశారు. కంపెనీల ఈ విధానాల వల్ల ఆరోగ్య లక్ష్యాలను సాధించడం కష్టమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అన్ని శాఖల ప్రాధాన్యత లాభదాయకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ పరిశ్రమలు మార్కెట్లో పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. దీని కారణంగా అవి తరచుగా రాజకీయ శక్తులను కూడా ప్రభావితం చేస్తాయి. ఐరోపాలో 60 శాతం మంది పెద్దలు, మూడింట ఒక వంతు మంది పిల్లలు ఊబకాయం (అధిక బరువు) సమస్యలతో బాధపడుతున్నారు.
2017 నుండి వచ్చిన డేటా ప్రకారం ఐరోపాలో గుండె జబ్బులు, క్యాన్సర్తో మరణిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ఆహారపు అలవాట్ల ఫలితంగానే చనిపోతున్నారు. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేసే కంపెనీలపై కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు పిలుపునిచ్చింది. ప్రజలు తమ ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ పరిశ్రమల నెట్వర్క్ చాలా పెద్దదని, అవి ప్రభుత్వాల విధాన రూపకల్పనలో కూడా జోక్యం చేసుకుంటున్నాయని హన్స్ క్లూగే చెప్పారు. కంపెనీల గుత్తాధిపత్య పద్ధతులు, లాబీయింగ్ పద్ధతులను ఆపడానికి చర్యలు తీసుకోవాలని హన్స్ క్లూగే దేశాలను కోరారు.
Read Also:Balakrishna: ఇది కదా బాండింగ్ అంటే.. చెల్లెలిని ఆత్మీయంగా ముద్దాడిన బాలయ్య
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!