Europe : ప్రజల పాలిట శాపంగా నాలుగు పరిశ్రమలు.. ప్రతిరోజూ 7000 మంది మృతి
- చెడు ఆహారపు అలవాట్లతో ఐరోపాలో 27లక్షలమంది మృతి
- ఈ మరణాలకు మద్యం పొగాకు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ శిలాజ ఇంధనం కంపెనీలే కారణం
- కఠినమైన చట్టాలను అమలు చేయాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
Europe : ఐరోపా ప్రజలలో ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఇలాంటి ఆహారపు అలవాట్ల వల్ల కలిగే హాని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన నివేదికను షేర్ చేసింది. నాలుగు రకాల పరిశ్రమల గురించి నివేదికలో చాలా ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. మద్యం, పొగాకు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, శిలాజ ఇంధనం ఈ నాలుగు పరిశ్రమలు ఐరోపాలో 27 లక్షల మరణాలకు కారణమయ్యాయని ఈ నివేదికలో పేర్కొంది.
‘ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరోప్ ప్రాంతంలో నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ కమర్షియల్ డిటర్మినెంట్స్'(‘Commercial Determinants of Non Communicable Diseases in WHO Europe Region’) అనే ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలు ఈ పరిశ్రమలను ఆపడానికి కఠినమైన చట్టాలను అమలు చేయాలని పిలుపునిచ్చాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ రీజియన్ డైరెక్టర్ హన్స్ క్లూగే ఒక ప్రకటనలో, “ఈ నాలుగు పరిశ్రమలు ఐరోపాలోని 53 దేశాలలో ప్రతిరోజూ కనీసం 7 వేల మందిని చంపుతున్నాయి.” అని పేర్కొన్నారు.
Also Read
- Dragon: ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
- Trisha Karuppu: వయసు రివర్స్ అవుతోంది.. త్రిష బ్యూటీపై ఫ్యాన్స్ ఫిదా! కానీ మేకర్స్తో గొడవ ఏంటి?
- Peddi: చరణ్ ‘పెద్ది’ పంజా.. మహేష్ బాబు నిర్మిస్తున్న ‘రావు బహదూర్’కు థియేటర్ల సెగ!
- Devara 2: దేవర 2 నుండి.. నందమూరి ఫ్యాన్స్కు కొరటాల అదిరిపోయే ప్రామిస్!
Read Also:TG TET 2024 Results: టీజీ టెట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
ఈ నాలుగు పరిశ్రమలు ప్రజా విధానాలను అడ్డుకుంటున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోపించింది. అంతేకాకుండా తప్పుడు ప్రకటనలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, సైన్స్ను అపహాస్యం చేయడం వంటి ఆరోపణలు చేశారు. కంపెనీల ఈ విధానాల వల్ల ఆరోగ్య లక్ష్యాలను సాధించడం కష్టమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అన్ని శాఖల ప్రాధాన్యత లాభదాయకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ పరిశ్రమలు మార్కెట్లో పెద్ద వాటాను కలిగి ఉన్నాయి. దీని కారణంగా అవి తరచుగా రాజకీయ శక్తులను కూడా ప్రభావితం చేస్తాయి. ఐరోపాలో 60 శాతం మంది పెద్దలు, మూడింట ఒక వంతు మంది పిల్లలు ఊబకాయం (అధిక బరువు) సమస్యలతో బాధపడుతున్నారు.
2017 నుండి వచ్చిన డేటా ప్రకారం ఐరోపాలో గుండె జబ్బులు, క్యాన్సర్తో మరణిస్తున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ఆహారపు అలవాట్ల ఫలితంగానే చనిపోతున్నారు. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేసే కంపెనీలపై కఠిన చట్టాలను అమలు చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశాలకు పిలుపునిచ్చింది. ప్రజలు తమ ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ పరిశ్రమల నెట్వర్క్ చాలా పెద్దదని, అవి ప్రభుత్వాల విధాన రూపకల్పనలో కూడా జోక్యం చేసుకుంటున్నాయని హన్స్ క్లూగే చెప్పారు. కంపెనీల గుత్తాధిపత్య పద్ధతులు, లాబీయింగ్ పద్ధతులను ఆపడానికి చర్యలు తీసుకోవాలని హన్స్ క్లూగే దేశాలను కోరారు.
Read Also:Balakrishna: ఇది కదా బాండింగ్ అంటే.. చెల్లెలిని ఆత్మీయంగా ముద్దాడిన బాలయ్య
తాజావార్తలు
-
NTRNeel : డ్రాగన్ కోసం ఎన్టీఆర్ డబుల్ మేకోవర్.. ఫ్యాన్స్ కు పూనకాలే
-
Dragon: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బ్యూటీ..
-
OTT Movies : ఈ వారం ఓటీటీ క్లాష్లో ఎవరు టాప్లో నిలుస్తారు?
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!