1. నేడు బీఆర్ఎస్లోకి ఏపీ నుంచి భారీ చేరికలు. కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్న మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ మంత్రి రావెల, మాజీ ఐఆర్ఎస్ పార్థసారథి, పలువురు నేతలు. సాయంత్రం 4 గంటలకు బీఆర్ఎస్లోకి నేతలు.
2. ఇవాళ ఇందిరా పార్కు ధర్నా చౌక్ లో సర్పంచుల సమస్యలపై కాంగ్రెస్ ధర్నా.
గ్రామ పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా.
3. యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శనం. యాదాద్రిలో మొదటిసారి శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కావడంతో పోటెత్తిన భక్తి జనం.
4. నేడు శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవారికి రావణ వాహనసేవ. ఆలయ ఉత్తర భాగంలో రావణ వాహనంపై ఆశీనులను చేసి శ్రీస్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు
5. అనంతపురం : నేటి నుంచి ఆర్డీటీ , పీటీసీ మ్తెదానంలో రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు.
6. అనంతపురం : కణేకల్లులో వ్యవసాయ శాఖకు చెందిన విత్తన వరి క్షేత్రంలో చోటు చేసుకున్న అక్రమాలప్తె నేటి నుంచి ఆడిట్ బృందం విచారణ.
7. నేటి నుంచి రాష్ట్ర సచివాలయం తో పాటు జిల్లా కార్యాలయాల్లో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లో ఉద్యోగుల అటెండెన్స్.
8. నేడు ముఖ్యమంత్రి జగన్ తో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భేటీ. సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలని ఆదేశం. ఇటీవల కాలంలో ప్రభుత్వ తీరుపై వివిధ సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న శ్రీధర్ రెడ్డి.
9. నేడు వైకుంఠ ఏకాదశి. భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ.