* IPL 2026: ఇవాళ CSK వర్సెస్ SRH.. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* నేడు కేరళం ముఖ్యమంత్రి సతీశన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం.. ఉదయం 10 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేయనున్న వీడీ సతీశన్.. సీఎంతో సహా మంత్రులుగా 21 మంది ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న AICC చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి
* అమరావతి: ఖరీఫ్ కు నీటి విడుదల పై ప్రభుత్వం దృష్టి.. ఇవాళ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, ఉన్నతాధికారులు సచివాలయంలో సమావేశం.. కృష్ణ- గోదావరి డెల్టాలకు ఖరీఫ్ నీటి విడుదల పై చర్చ.. మే 15 నుంచే ఖరీఫ్ కు యాక్షన్ ప్లాన్ ఉండాలన్న సీఎం చంద్రబాబు. దీంతో మంత్రులు అధికారులు సమావేశం.
* అమరావతి: ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే పెట్రోల్, డీజిల్ కు అధిక ధరలు.. ప్రభుత్వ తీరుకు నిరసనగా ప్రజల తరుఫున ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చిన వైసీపీ.. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్న వైసీపీ శ్రేణులు..
* అమరావతి : ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగుళూరు లోని తన నివాసం నుంచి బయలుదేరి 5.40 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్న జగన్
* అనంతపురం : పెట్రోల్ డీజిల్ పెంపుకు నిరసనగా వైఎస్ఆర్సిపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. బుక్కరాయసముద్రం వైసీపీ పార్టీ ఆఫీసు నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ.
* తూర్పుగోదావరి జిల్లా: నేడు పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు .. అన్ని నియోజకవర్గాల్లోని పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడానికి ఏర్పాట్లు
* శ్రీ సత్యసాయి : పెట్రోల్, డీజిల్ ధరలు నిరసిస్తూ ధర్మవరం వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ఆర్డిఓ ఆఫీస్ వరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ.
* కాకినాడ: నేటి సాయంత్రానికి జగ్గంపేటకు మంత్రి లోకేష్.. రేపు తాళ్లూరు పంపుహౌస్ మరమ్మతు పనులకి శంకుస్థాపన చేయనున్న మంత్రి.. రైతులతో ముఖాముఖి,రచ్చబండ కార్యక్రమం లో పాల్గొనున్న లోకేష్
* సంగారెడ్డి: నేడు జహీరాబాద్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన.. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి జూపల్లి
* శ్రీ సత్యసాయి: పరిగి మండలంలో నేడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పర్యటన. పరిగి నుంచి శ్రీరంగరాజు పల్లి గ్రామానికి 3.5 కోట్ల రూపాయలతో బీటీ రోడ్ నిర్మాణం కు పరిగి మండల కేంద్రంలో భూమి పూజ కార్యక్రమం.
