NTV Telugu Site icon

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

నేటి నుంచి రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30కు సీఎం పర్యటన మొదలవనుండగా.. సాయంత్రం 4.35కు ముగుస్తుంది.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు ఈరోజు విజయవాడలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగనుంది. సోమవారం మధ్యాహ్నం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చలు అసంపూర్ణం అవ్వడం కారణంగా సమ్మె కొనసాగనుంది.

నేడు డోన్‌లో వైసీపీ నేతలతో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సమావేశం కానున్నారు.

నేడు నాంపల్లి కోర్టులో తిరుపతన్న, భుజంగరావు బెయిల్ పిటిషన్‌లపై విచారణ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోరుతూ తిరుపతన్న, భుజంగరావు పిస్టిషన్లు వేసిన విషయం తెలిసిందే.

లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నేడు హైకోర్ట్ తీర్పు ఇవ్వనుంది.

కేసీఆర్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. 2011లో రైల్ రోకో కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో కేసీఆర్ పిటిషన్‌ వేశారు.