What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* హైదరాబాద్: నేడు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం కానున్న సీఎం రేవంత్రెడ్డి.. ఆరు గ్యారెంటీలు, ప్రజాపాలన కార్యక్రమంపై చర్చించనున్న సీఎం.. పలు కీలక విషయాలపై కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేయనున్న సీఎం రేవంత్రెడ్డి
* కడప జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన.. ఈ రోజు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్న సీఎం.. ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్ధనల్లో పాల్గొననున్న సీఎం.. మధ్యాహ్నం 12.30 గంటలకు సింహాద్రిపురానికి జగన్.. మండల, ఎమ్మార్వో ఆఫీసు, పోలీసు స్టేషన్, రోడ్డు వైడనింగ్ వంటి పలు కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొని సాయంత్రం తిరిగి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం.. రాత్రికి ఇడుపులపాయ గెస్ట్హౌస్లో బస
Also Read
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Nandini Reddy: "నా పక్కన లేనిది మొగుడు ఒక్కడే.! మిగతావన్నీ ఉన్నాయి.." పెళ్లి, ఒంటరితనంపై ఓపెన్ అయిన లేడి డైరెక్టర్.!
* హైదరాబాద్: నేడు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్.. కాంగ్రెస్ సర్కార్ విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్గా తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం వివరిస్తూ ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్న కేటీఆర్
* తిరుమల: ఇవాళ ద్వాదశి సందర్భంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్న అర్చకులు
* తిరుమల: సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో కోనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారి.. ప్రస్తుతం 30వ తేదీకి సంబంధించిన టోకెన్లు జారి చేస్తున్న టీటీడీ.. జనవరి 1వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లు జారీ చేయనున్న టీటీడీ
* తిరుమల: ఎల్లుండి టీటీడీ పాలకమండలి సమావేశం
* ప్రకాశం : ఒంగోలు మండలం చెరువుకొమ్ముపాలెంలో ఆడుదాం ఆంధ్ర లాంచింగ్ ర్యాలీని ప్రారంభించనున్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి..
* ప్రకాశం : రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం రద్దు..
* గుంటూరు: నేడు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో జిల్లా స్థాయి సైక్లింగ్ జట్ల ఎంపిక పోటీలు.. ఈనెల 26న నల్లపాడు లయోలా పాఠశాలలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్..
* గుంటూరు: అమరావతి రోడ్డు లోని హిందూ ఫార్మసీ కళాశాలలో రాష్ట్రస్థాయి ర్యాంకింగ్ చెస్ టోర్నమెంట్..
* గుంటూరు: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈనెల 27 నుండి గుంటూరులో సమ్మె చేయనున్న పురపాలక సంస్థ సిబ్బంది.
* గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నేడు రెండవ రోజు నంది నాటకోత్సవ పోటీలు.. ఈనెల 29 వరకు సాగానున్న నంది నాటకోత్సవ పోటీలు.
* గుంటూరు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహించనున్న కార్యక్రమాన్ని క్రిస్టమస్ సందర్భంగా రద్దు చేసిన అధికారులు…
* పల్నాడు: నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్న పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ బహిష్కృత నేతలు.. గత కొద్ది నెలల క్రితం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో బహిష్కరణకు గురైన కంచేటి సాయి, దండ నాగేంద్ర తదితర నాయకులు.
* ప్రకాశం : దర్శిలో జనసేన నూతన ఇంచార్జీ గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, ముండ్లమూరు మండలం శంకరాపురం నుంచి దర్శి వరకూ భారీ ర్యాలీ..
* విశాఖ: జీవీఎంసీ ఎదుట అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ చేస్తున్న నిరవధిక సమ్మెకు సంఘీభావంగా రౌండ్ టేబుల్ సమావేశం. పాల్గొననున్న అఖిలపక్ష కార్మిక, ఉద్యోగ, విద్యార్థి, యువజన, మహిళా, ప్రజా సంఘాలు
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నెల్లూరు: ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి నెల్లూరులో మారథాన్ వాక్ కార్యక్రమం
* నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని శ్రామిక నగర్ జనసేన ఆధ్వర్యంలో ప్రజాబాట కార్యక్రమం
* ఏలూరు: ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ లో భాగంగా నేడు ఏలూరులో 3కే రన్ నిర్వహణ.. వట్లూరు సర్ సీఆర్ రెడ్డి మహిళా కళాశాల సమీపం నుంచి ఇండోర్ స్టేడియం వరకు 3కే రన్..
* అనంతపురం : శెట్టూరు మండలం ఐదుకళ్ళు గ్రామంలో గ్రామ- గ్రామానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం.
* అనంతపురం : గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాద్ వ్రతం ఉత్సవాలు.
* అనంతపురం: గుత్తి పట్టణంలో శ్రీ అయోధ్య రామయ్య అక్షింతలు ఊరేగింపు
* అనంతపురం : ఈనెల 29 న అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర.
* శ్రీ సత్యసాయి : లేపాక్షి మండల కేంద్రంలో వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి దేవ్ సింగ్ చౌహన్
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 5K రన్.. రాజమండ్రి వై జంక్షన్ వద్ద నుండి లాలాచెరువు వరకు 5K రన్
* హైదరాబాద్: నేడు గాంధీ భవన్ లో జరగాల్సిన టీపీసీసీ కార్యవర్గ సమావేశాలు వాయిదా.. సీఎం వైఎస్ జగన్ జిల్లా కలెక్టర్ల సమావేశాలు ఉన్న నేపథ్యంలో సమావేశాలు వాయిదా.. జనవరి మొదటి వారంలో టీపీసీసీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం.
* విజయనగరం జిల్లా: శృంగవరపుకోట సచివాలయం 1 పరిధిలో గడప గడప కి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న ఎమ్మెల్యే కడుబండి.శ్రీనివాసరావు
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు పార్వతీపురం ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్ర ర్యాలీ నిర్వహించనున్న అధికారులు
తాజావార్తలు
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
-
OTR: అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన
-
OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్లో చిచ్చు రేపిందా?
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!