What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు 8వ రోజు సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. తిరుపతిలోని గురువరాజు పల్లెలో ఉదయం 9 గంటలకు జగన్ బస్సు యాత్ర ఆరంభం కానుంది. మల్లవరం, ఏర్పేడు మీదుగా శ్రీకాళహస్తి బైపాస్.. అక్కడి నుంచి సింగనమల మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు డ్రైవర్స్ అసోసియేషన్స్ తో జగన్ ముఖాముఖి మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కాళహస్తి నాయుడుపేటలో బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.
నేడు కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు కొవ్వూరు చేరుకోనున్నారు. చాగల్లు రోడ్డు నుండి విజయ విహార్ సెంటర్ వరకు రోడ్ షో అనంతరం ప్రజాగళం సభలో ప్రసంగిస్తారు. సభ అనంతరం గోపాలపురం పర్యటనకు బాబు వెళ్లనున్నారు.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
నేడు అంబేద్కర్ కోనసీమ రామచంద్రపురంలో ఉమ్మడి జిల్లా టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం కానున్నారు. ఎన్నికల ప్రచార సరళి, క్షేత్రస్థాయిలో పరిస్థితులపై చర్చ జరగనుంది.
నేడు నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొననున్నారు. బేతంచెర్ల మండలం, హెచ్.కొట్టాల, గోరుమానుకొండ, పాణ్యం మండలం, భూపనపాడులో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించనున్నారు. నంద్యాలలో ఎస్.ఎన్.ఫంక్షన్ హాల్లో ఆమె బస చేయనున్నారు.
ఏపీలో రెండో రోజు పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. తొలిరోజు 25 లక్షల 66 వేల మంది లబ్దిదారులకు పెన్షన్ అందింది. ఈరోజు మరింత మంది లబ్దిదారులకు పెన్షన్ అందనుంది. ఈ నెల 6 వరకు పెన్షన్ ఇవ్వనున్న విషయం తెలిసిందే.
నేటి నుంచి సుజనా చౌదరి తన ప్రచారం ప్రారంభించనున్నారు. వన్ టౌన్ వినాయకుడి ఆలయంలో పూజలు చేసి ప్రచారం, పార్టీ కార్యాలయంను సుజనా చౌదరి ప్రారంభించనున్నారు.
నేడు నూతన రాజ్యసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబూరావు.. తెలంగాణ నుంచి ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు.
ఈరోజు రౌస్ ఎవిన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. కవిత పిటిషన్ను జడ్జి కావేరి బావేజా విచారించనున్నారు. గత నెల 15న లిక్కర్ కేసులో కవితను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జ్యూడిషియల్ రిమాండ్లో భాగంగా తీహార్ జైల్లో కవిత ఉన్నారు.
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
తాజావార్తలు
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
-
Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
-
CA Student Suspicious Death: భాగ్యనగరంలో విషాదం.. మియాపూర్ సీఏ విద్యార్థి మృతిలో భారీ ట్విస్ట్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..