What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు తూర్పుగోదావరి జిల్లాలో హోంమంత్రి తానేటి వనిత పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొవ్వూరు క్యాంప్ ఆఫీసులో హోం మంత్రి అనిత ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అనంతరం కొవ్వూరులో స్థానికంగా ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నేడు హైదరాబాదులో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. నెల్లూరు రూరల్ పరిధిలోని గుడపల్లిపాడు గ్రామంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటింటా ప్రచారం నిర్వహించనున్నారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతంలో మాజీ మంత్రి నారాయణ పర్యటించనున్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
అఖిలపక్ష ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో విశాఖ సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ వరకు సంఘీభావ ప్రదర్శన చేయనున్నారు. అంగన్వాడీ, మున్సిపల్, సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని.. కార్మికులపై నిర్బంధం ఆపాలని డిమాండ్ చేయనున్నారు.
నేడు తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరుపతికి వెళ్లనున్నారు. రేపు శ్రీవారిని తెలంగాణ గవర్నర్ దర్శించుకోనున్నారు. ఇవాళ రాత్రికి శ్రీరచనా అతిధి గృహంలో తమిళిసై బస చేస్తారు.
ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆటో డ్రైవర్ల సమస్యలపై పరిశీలన కమిటీ సమావేశం జరగనుంది. ఆటో డ్రైవర్లతో కమిటీ చర్చించనుంది. మధ్యాహ్నం 12:30కు తెలంగాణ భవన్లో సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన ఉపాధి కోల్పోతున్న ఆటో డ్రైవర్లతో కమిటీ చర్చలు జరపనుంది.
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. నేటి గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?
నేడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుపతికి వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం భట్టి.. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వెళుతున్నారు. ఇవాళ రాత్రికి శ్రీరచనా అతిధి గృహంలో భట్టి బస చేస్తారు. రేపు శ్రీవారిని భట్టి దర్శించుకోనున్నారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా మెట్రో రైళ్ల సమయంను ఆదివారం అధికారులు పొడిగించారు. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి.
నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణ, క్రమబద్ధీకరణకు డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 అర్ధరాత్రి దాటే వరకు హుస్సేన్సాగర్ చుట్టూ (ట్యాంక్బండ్, నెక్లెస్ రోడ్డు) వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయి. జనవరి 1న రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు (పీఎన్ఆర్ మార్గ్), అప్పర్ ట్యాంక్బండ్పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!