*నేడు జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు.. 10స్థానాల కోసం మధ్యాహ్నం వరకు జరగనున్న పోలింగ్.. బలం లేకపోయినా పోటీకి దిగిన టీడీపీ.. వైసీపీ అసంతృప్త కార్పొరేటర్ల ఓటింగ్ పై ఆశ.. ఓటింగ్కు వామపక్ష పార్టీలు దూరం
*నేడు పోలవరంలో పర్యటించనున్న మంత్రి అంబటి రాంబాబు.. వరద పరిస్థితులపై అధికారులతో సమీక్షించనున్న మంత్రి
*తెలంగాణకు భారీ వర్షసూచన, రెడ్ అలర్ట్ జారీ.. నేడు, రేపు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు.. హైదరాబాద్లో ఉరుములతో కూడిన వర్షాలు.. ఖమ్మం మహబూబాబాద్ జనగాం జిల్లాలకు రెడ్ అలర్ట్.. కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
*ఏపీలో పలుచోట్ల కురవనున్న వర్షాలు
*నేటి నుంచి దేశవ్యాప్తంగా కిసాన్ కాంగ్రెస్ రైతు భరోసా యాత్ర
*నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీశ్ రావు పర్యటన.. సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
*ఉత్తరాది రాష్ట్రాలకు భారీ వర్షసూచన.. 8 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ చేసిన ఐఎండీ
*నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయం.. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
*నేటి నుంచి ఆస్ట్రేలియా vs ఇంగ్లండ్ జట్ల మధ్య నాలుగో టెస్ట్.. 5 టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఆసీస్