Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన. ఉదయం 10 గంటలకు కర్నూలులో కేంద్ర న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన. ఉదయం 11.30 గంటలకు బనగానపల్లెకు సీఎం జగన్. 100 పడకల ఏరియా ఆస్పత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్. తర్వాత అనంతపురం బహిరంగ సభలో పాల్గొననున్న జగన్.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,830 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 60,340 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.78,840 లుగా ఉంది.
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
నేడు తెలంగాణలో సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో భేటీ కానున్న కేబినెట్ సభ్ కమిటీ. 317, 46 జీవోలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకోనున్న కమిటీ.
నేటితో ముగియునున్న గ్రూప్-1 దరఖాస్తు గడువు. ఇప్పటివరకు వచ్చిన 2.7 లక్షల అప్లికేషన్లు.
నేడు గంటా శ్రీనివాసరావు నివాసంలో కీలక సమావేశం. ముఖ్యనేతలతో రాజకీయ భవిష్యత్కు చర్చించనున్న గంటా. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని గంటాకు హైకమాండ్ ఆదేశం. నిన్న చంద్రబాబును కలిసి విశాఖ జిల్లాలో సీటు ఇవ్వాలని కోరిన గంటా. పోటీ చేస్తే చీపురుపల్లి లేదంటే పార్టీ కోసం పనిచేయాలన్న హైకమాండ్. చీపురుపల్లి పోటీపై ఆసక్తి చూపని గంటా. అనుచరులతో సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్న గంటా.
నేడు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటన. మెజారిటీ స్థానాలు ప్రకటిస్తామన్న చంద్రబాబు. పలు లోక్ సభ స్థానాలకు కూడా అభ్యర్థుల ప్రకటన. మొదటివిడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.
నేడు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా వైసీపీ సమన్వయ కమిటీ భేటీ. హాజరుకానున్న వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స, నేతలు.
అభ్యర్థుల ఎంపికపై జనసేన పార్టీ కసరత్తు. నేడు జనసేన తుది జాబితా విడుదల చేసే అవకాశం. 15స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం. ఇప్పటికే 6 చోట్ల అభ్యర్థులను ప్రకటించిన పవన్. పవన్ కల్యాణ్ పోటీపై నేడు స్పష్టత వచ్చే ఛాన్స్.
రేపు హైదరాబాద్లో ప్రధాని మోడీ రోడ్ షో. మోడీ పర్యటన నేపథ్యంలో నేడు బీజేపీ సన్నాహక సమావేశం. విశాఖజిల్లాలో సీటు ఇవ్వాలని చంద్రబాబును కోరిన గంటా.
నేడు ఢిల్లీలో కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్. రాంలీలా మైదానంలో రైతు సంఘాల సభ.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!