Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికలు.. రేస్ నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha Elections 2024: రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలు అటువైపు దృష్టిసారించాయి.. ఇక, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా తమ అభ్యర్థిని పోటీలో పెడుతుందనే ప్రచారం జరుగుతూ వచ్చింది.. అయితే, రాజ్యసభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవాలన్నా.. ఇప్పుడున్న బలం కంటే అదనంగా 25 నుంచి 26 ఎమ్మెల్యేల అవసరం టీడీపీకి ఉంటుంది.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలైనా కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్రెడ్డి, శ్రీదేవి, ఆనం రామనారయణరెడ్డిలపై వేటు పడకుంటే ఆ సంఖ్య కాస్త తగ్గుతుంది..
Read Also: Andhra Pradesh: సమ్మెకు సిద్ధమవుతోన్న ఉద్యోగులు..! నేడు మంత్రుల బృందం చర్చలు
Also Read
- Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
- Summer Hair Care Tips: వేసవిలో ప్రతిరోజూ తలస్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీ కోసమే..
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
ఇక, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయాయి.. టీడీపీ సంఖ్యాబలాన్ని తగ్గించేందుకు వైసీపీ కసరత్తు చేస్తుంటే.. అయితే, తమకు వైసీపీపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. పోటీ చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ.. కానీ, ఇప్పుడు సైకిల్ పార్టీ నుంచి రాజ్యసభ ఎన్నికల హడావిడి అంతగా కనిపించడంలేదు.. పెద్దల సభకు పోటీపై టీడీపీ అధినేత ఏమైనా సైలెంట్ఆపరేషన్ చేస్తున్నారా? లేక పోటీ నుంచి తప్పుకుంటారా? అనే చర్చ తమ్ముళ్ల మధ్య జరుగుతుంది.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
చంద్రబాబు సైలెంట్గా ఉండడంతో.. ఈ మౌనం దేనికి సంకేతం? రాజ్యసభ రేస్ నుంచి టీడీపీ తప్పుకున్నట్టేనా? లేక గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారా? అనే చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి హడావిడి లేకుండానే అభ్యర్థిని బరిలోకి దింపడం.. ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం చకచకా జరిగిపోయాయి.. ఇప్పుడు కూడా అలాంటి సీక్రెట్ ఆపరేషన్ జరుగుతుందా? అనే చర్చ జరుగుతుంది. వైసీపీలో అసంతృప్తుల సంఖ్య ఎక్కువగానే ఉంది.. దీంతో, వారితో టీడీపీ హైకమాండ్ టచ్లోకి వెళ్లిఉండవచ్చు అని.. లేదా? వైసీపీ అసంతృప్తులే టీడీపీతో టచ్లోకి వచ్చిఉంటారనే వాదన వినిపిస్తోంది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలతోనే వ్యవహారం కాబట్టి సాఫీగా సాగిపోయింది.. కానీ, రాజ్యసభలో పరిస్థితి వేరు.. 25 నుంచి 26 మంది పక్క పార్టీ ఎమ్మెల్యేలను ఒప్పించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పరిస్థితి అనేది టీడీపీ వర్గాల్లో సాగుతోన్న చర్చ.. ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ అంశంపై ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!