Rajastan: రాజస్థాన్లో రూ.20 వేల కోట్ల నీటి కుంభకోణం ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajastan: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 25న జరుగనున్నాయి. అంతకుముందే రూ.20 వేల కోట్ల నీటి కుంభకోణం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఐఏఎస్ అధికారుల నుంచి మొదలుకొని సీనియర్ అధికారులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. నవంబర్ 3న జైపూర్, దౌసాలోని 23 చోట్ల ఐఏఎస్ ర్యాంక్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ సుబోధ్ అగర్వాల్ నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ విషయం కేంద్రం జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుకు సంబంధించినది. రాజస్థాన్లో కేంద్రం చేపట్టిన ప్రాజెక్టు అమలులో అక్రమాలు జరిగాయని, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆగస్టులో అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. తరువాత విషయం ఈడీకి చేరింది. ఇప్పటి వరకు 25 చోట్ల ఈడీ దాడులు చేసింది.
రూ.20 వేల కోట్ల నీటి కుంభకోణం ఏమిటి?
జల్ జీవన్ మిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్, దీని లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు స్వచ్ఛమైన, తగినంత నీటిని అందించడం. తద్వారా ఎవ్వరికీ నీటి కొరత ఉండకుండా చూడాలన్నది కేంద్ర ఉద్దేశం. ప్రాజెక్టు మొత్తం బడ్జెట్లో సగం కేంద్ర ప్రభుత్వం, సగం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తుంది. రాజస్థాన్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికైన కిరోరి లాల్ మీనా ఈ మిషన్లో అక్రమాలపై తొలిసారిగా మాట్లాడారు. ప్రాజెక్టు అమలులో రూ.20 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు.
Also Read
Read Also:Telangana Election 2023: తెలంగాణలో ఇంటి వద్దే ఓటింగ్.. ప్రారంభమైన ప్రక్రియ
ఆరోపణలు ఏమిటి
ఈ ప్రాజెక్టు కింద 48 ప్రాజెక్టులను నకిలీ సర్టిఫికెట్ల ఆధారంగా రెండు సంస్థలకు ఇచ్చారని కిరోరి లాల్ మీనా ఆరోపించారు. రెండేళ్లలో రూ.900 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయి. స్కామ్ను గుర్తించకుండా నిరోధించడానికి, ఇమెయిల్ ఐడిలు, ధృవపత్రాలు కూడా నకిలీ చేయబడ్డాయి. స్కామ్ కారణంగానే ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోందని కిరోరి లాల్ మీనా ఆరోపిస్తున్నారు. మొత్తం వ్యవహారంలో రూ.20 వేల కోట్ల భారీ గేమ్ ఆడిందని ఆరోపించారు. నిబంధనలను తుంగలో తొక్కి కాంట్రాక్టు ఇచ్చారనే ఆరోపణలతో గణపతి ట్యూబ్ వెల్ కంపెనీ, శ్రీ శ్యామ్ షాపూర్ ట్యూబ్ వెల్ కంపెనీ పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇచ్చి టెండర్లు, అక్రమ సెక్యూరిటీలు పొందుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ రెండు సంస్థలు సుమారు రూ.1000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయని ఆరోపణలు వచ్చాయి. ఇలా అన్ని కోణాల్లో ఈడీ దర్యాప్తు చేస్తోంది.
ఈడీ విచారణలో ఏం కనుగొంది?
ఈ కేసులో సెప్టెంబరు నుంచి ఈడీ దాడులు నిర్వహిస్తోంది. సెప్టెంబరులో జైపూర్, అల్వార్, నీమ్రానా, బెహ్రోర్, షాపురా తదితర ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో రూ.2.32 కోట్ల నగదు, రూ.64 లక్షల విలువైన బంగారం, పలు డాక్యుమెంట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. వీటిలో హార్డ్ డిస్క్లు, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. విచారణలో ఇప్పటివరకు రూ.5.83 కోట్ల విలువైన 9.6 కిలోల బంగారం, రూ.3.9 లక్షల విలువైన 6.4 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. పీహెచ్ ఈడీ, భూగర్భ జల శాఖకు చెందిన ఏసీఎస్ సుబోధ్ అగర్వాల్తో సహా చాలా మంది సీనియర్ అధికారులు ఈ కేసులో ఈడీ పరిధిలో ఉన్నారు. సుబోధ్ అగర్వాల్తో పాటు, ఇతర అధికారులు కూడా ఈడీ పరిధిలోనే ఉన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఈడీ కేసు దర్యాప్తు చేస్తోంది.
Read Also:Child Missing Case: సినిమా స్టైల్ లో మిస్టరీని ఛేదించి చిన్నారిని కాపాడిన కానిస్టేబుల్
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!