BJP: రాహుల్ గాంధీని కులం అడిగితే తప్పేంటి..? ఆయన అదే పనిచేస్తున్నారు కదా..
- రాహుల్ గాంధీని కులం అడిగితే తప్పేంటి..?
- ఆయన వేరే వారి కులం అడగొచ్చా..?
- కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఫైర్..
BJP: లోక్సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పరోక్షంగా ఉద్దేశిస్తూ చేసిన ‘‘కులం’’ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా విమర్శలు చెలరేగుతున్నాయి. కాంగ్రెస్కి ఎస్పీ వంటి ఇండియా కూటమి పార్టీలు మద్దతుగా నిలుస్తున్నాయి. మంగళవారం సభలో ఠాకూర్ మాట్లాడుతూ..‘‘కులం తెలియనివారు కులగణన గురించి మాట్లాడుతున్నారు’’ అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ఈ వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్రమోడీ మద్దతుగా నిలిచిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధానికి వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉంటే, ఈ వివాదంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు బుధవారం మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కులం అడగడంలో తప్పు లేదని, అదే పని చేస్తూ ఆయన కుల ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఠాకూర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల కులాన్ని అడగటం ద్వారా కాంగ్రెస్ దేశాన్ని విభజించే కుట్ర పన్నిందని, రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడినప్పుడు చాలా నిరసనలు వ్యక్తమవుతున్నాయని రిజిజు అన్నారు.
Also Read
Read Also: Pakistan: F-16 యుద్ధ విమానాలను నడపలేని స్థితిలో పాక్.. ఆర్థిక ఇబ్బందులతో వ్యూహాత్మక చిక్కులు..
పార్లమెంట్ కాంప్లెక్స్లో విలేకరులతో మాట్లాడిన కిరణ్ రిజిజు..‘‘ కాంగ్రెస్ ప్రతీ రోజు కులం గురించి మాట్లాడుతుంది, అతను (రాహుల్ గాంధీ) మీడియా ప్రతినిధులను కలిసినప్పుడు వారి కులం అడుగుతాడు, అతను సాయుధ బలగాల కులాన్ని అడుగుతాడు, భారత్ జోడో యాత్రలో అతను ప్రజల కులం అడుగుతాడు. వారు ప్రజల కులం గురించి అడగవచ్చు, కానీ అతని కులం గురించి ఎవరూ అడగొద్దు.. ఏంటి ఇది? అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చారు. వారు దేశం, పార్లమెంటు కంటే ఉన్నతమైనవారా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే కుట్రగా రిజిజు అభివర్ణించారు. వీధుల నుంచి పార్లమెంట్ వరకు హింసను వ్యాప్తి చేయాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడ్డారు. ప్రజలను విభజించేందుకు కాంగ్రెస్ చేసే ప్రయత్నాలను బీజేపీ ఎన్నటికీ అనుమతించబోదని స్పష్టం చేశారు. ప్రధాని ఓబీసీ వర్గానికి చెందిన వారని, అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని చెప్పారు. మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, రాజీవ్ గాంధీలు ఓబీసీ, ఎస్సీ-ఎస్టీ రిజర్వేషనర్లు వ్యతిరేకించారని అన్నారు. 70 ఏళ్లుగా అధికారంలో ఉన్న మీరు ఎందుకు కులగణన చేయలేదని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Sorakaya Garelu Recipe: కరకరలాడే కమ్మని సొరకాయ గారెలు.. 10 నిమిషాల్లో ఇలా రెడీ చేసేయండి.!
-
Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..
-
Sun Pharma: అమెరికా గడ్డపై భారత ఫార్మా జెండా.. లక్ష కోట్లతో దిగ్గజ కంపెనీని కొనుగోలు చేసిన సన్ ఫార్మా!
-
వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు
-
Fire Accident : అంబర్పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!