Site icon NTV Telugu

KTR Tweet: ప్రధాని గారు మా మూడు ప్రధాన హామీల సంగతేంటి..?

Minister Ktr

Minister Ktr

నేడు తెలంగాణ పర్యటనకు వస్తున్న.. ప్రధాని నరేంద్ర మోడీ 8వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు. ఇక, ప్రధాని పర్యటన వేళ ట్విట్టర్ వేదికగా ప్రధానిపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ ( ఎక్స్ ) పోస్ట్.. 1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు?, 2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు?, 3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు?, మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్నారు.. మరి.. ఆ మూడు విభజన హక్కులకు దిక్కేది? అని కేటీఆర్ ప్రశ్నించారు.

Read Also: AP BJP: నేడు ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ.. జనసేనతో పొత్తుపై కీలక చర్చ

పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర..? అని మంత్రి కేటీఆర్ అడిగారు. మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు..?, గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా?.. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు అని ఆయన విమర్శించారు. లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్ ను ఆగం చేశారు.. మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు.. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు.. మీ పదేళ్ల పాలనలో.. 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారు అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు.

Read Also: NTR: ఆ సూపర్ స్టార్స్ ‘అవెంజర్స్’ అయితే ఎన్టీఆర్ ‘థానోస్’ లాంటి విలన్…

2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్నారు.. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు అన్నారు.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు.. పెట్రోల్ ధరలు నియంత్రిస్తాం అన్నారు.. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మీ పసుపు బోర్డు ప్రకటన కూడా.. మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉంది.. ఎన్నికల వేళ హంగామా ఇప్పుడు.. మరి అది అమలు అయ్యేది ఎప్పుడో.. ప్రధానిగా మీ పదేళ్ల పాలనలో.. అదానికి తప్ప.. ఆమ్ ఆద్మీకి దక్కిందేంటి..! అని అడిగారు.

Read Also: Bathukamma Sarees: రేపటి నుంచి తెలంగాణలో బతుకమ్మ చీరల పంపిణీ..

మా మూడు ప్రధాన హామీలు నెరవేర్చకపోతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గూడు చెదరడం పక్కా..! అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మళ్లీ వంద స్థానాల్లో మీ డిపాజిట్లు గల్లంతవడం గ్యారెంటీ..! అని ఆయన విమర్శించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం అన్నారు.. పెట్రోల్ ధరలు నియంత్రిస్తామన్నారు.. మీ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప.. దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటనుు నెరవేర్చరా..? కేటీఆర్ అంటూ ట్వీట్ చేశారు.

Exit mobile version