Shocking Incident: ఎవడ్రా బాబు ఇలా ఉన్నాడు.. ‘మనిషి మాంసం తినాలని హత్య’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: కొన్ని సంఘటనలు మనుషులను భయబ్రాంతులకు గురి చేస్తాయి. వాటిని చూస్తే ఎవడ్రా బాబు ఇలా ఉన్నాడు.. అనిపిస్తుంది. నిజంగా అలాంటి సంఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లాలోని దిన్హాటా ప్రాంతంలో తాజాగా వెలుగు చూసింది. ఇంతకీ ఆ సంఘటన ఏంటో తెలుసా.. మనిషి మాంసాన్ని తినాలనే ఉద్దేశ్యంతో ఒక వ్యక్తిని హత్య చేయడం. ఈ సంఘటన మొత్తం బెహార్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Good News : రైతన్నకు శుభవార్త.. సన్న ధాన్యానికి బోనస్ విడుదల
Also Read
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
- Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. కుసార్ హాత్ సమీపంలోని జలాశయంలో అతని మృతదేహం గుర్తించామని చెప్పారు. గుర్తు తెలియని యువకుడి మెడ, గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు. మృతుడి గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదని చెప్పారు. మృతుడు శ్మశాన వాటికలో ఒక గుడిసెలో నివసించినట్లు సమాచారం. ఈ కేసులో ఫిర్దౌస్ ఆలం అనే యువకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని, హత్య తర్వాత, ఆయన మృతుడి మృతదేహాన్ని నీటి కుళాయి వద్దకు తీసుకెళ్లి, శుభ్రం చేసి, తరువాత దాచిపెట్టాడని చెప్పారు. నిందితుడు మృతుడి శరీరంలోని కొన్ని భాగాలను తినాలని అనుకున్నాడని దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని చెప్పారు.
అనంతరం దిన్హాటా SDPO ధీమాన్ మిత్రా మాట్లాడుతూ.. ఈ కేసు చాలా అరుదైనది, తీవ్రమైనదని పేర్కొన్నారు. మనిషి మాంసాన్ని తినాలనే ఉద్దేశ్యంతో నిందితుడి మృతుడిని చంపారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఇది నరమాంస భక్షణకు సంబంధించిన అరుదైన కేసుగా పరిగణించబడుతోందని వెల్లడించారు. నిందితుడి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని, ఆ సమాచారం ఆధారంగానే అతన్ని అరెస్టు చేశామని SDPO చెప్పారు. ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
READ ALSO: ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రో-కో మధ్యే అసలైన పోరు..
తాజావార్తలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
-
No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
-
Ghani Movie Failure: ‘గని’ ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
-
Team India: లంకలో అడుగుపెట్టిన గిల్ సేన.. ఇక వేట మొదలుపెట్టుడే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!