Shocking Incident: ఎవడ్రా బాబు ఇలా ఉన్నాడు.. ‘మనిషి మాంసం తినాలని హత్య’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Incident: కొన్ని సంఘటనలు మనుషులను భయబ్రాంతులకు గురి చేస్తాయి. వాటిని చూస్తే ఎవడ్రా బాబు ఇలా ఉన్నాడు.. అనిపిస్తుంది. నిజంగా అలాంటి సంఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లాలోని దిన్హాటా ప్రాంతంలో తాజాగా వెలుగు చూసింది. ఇంతకీ ఆ సంఘటన ఏంటో తెలుసా.. మనిషి మాంసాన్ని తినాలనే ఉద్దేశ్యంతో ఒక వ్యక్తిని హత్య చేయడం. ఈ సంఘటన మొత్తం బెహార్ జిల్లాలో కలకలం సృష్టించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Good News : రైతన్నకు శుభవార్త.. సన్న ధాన్యానికి బోనస్ విడుదల
Also Read
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. కుసార్ హాత్ సమీపంలోని జలాశయంలో అతని మృతదేహం గుర్తించామని చెప్పారు. గుర్తు తెలియని యువకుడి మెడ, గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని వివరించారు. మృతుడి గుర్తింపు ఇంకా నిర్ధారించబడలేదని చెప్పారు. మృతుడు శ్మశాన వాటికలో ఒక గుడిసెలో నివసించినట్లు సమాచారం. ఈ కేసులో ఫిర్దౌస్ ఆలం అనే యువకుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నాడని, హత్య తర్వాత, ఆయన మృతుడి మృతదేహాన్ని నీటి కుళాయి వద్దకు తీసుకెళ్లి, శుభ్రం చేసి, తరువాత దాచిపెట్టాడని చెప్పారు. నిందితుడు మృతుడి శరీరంలోని కొన్ని భాగాలను తినాలని అనుకున్నాడని దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని చెప్పారు.
అనంతరం దిన్హాటా SDPO ధీమాన్ మిత్రా మాట్లాడుతూ.. ఈ కేసు చాలా అరుదైనది, తీవ్రమైనదని పేర్కొన్నారు. మనిషి మాంసాన్ని తినాలనే ఉద్దేశ్యంతో నిందితుడి మృతుడిని చంపారని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. ఇది నరమాంస భక్షణకు సంబంధించిన అరుదైన కేసుగా పరిగణించబడుతోందని వెల్లడించారు. నిందితుడి గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారని, ఆ సమాచారం ఆధారంగానే అతన్ని అరెస్టు చేశామని SDPO చెప్పారు. ఈ కేసుపై క్షుణ్ణంగా దర్యాప్తు జరుగుతుందని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు.
READ ALSO: ICC ODI Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో రో-కో మధ్యే అసలైన పోరు..
తాజావార్తలు
-
Romantic Movie OTT: థియేటర్లలో దేకలే… ఓటీటీలో మాత్రం ఊపేస్తున్న తెలుగు రొమాంటిక్ మూవీ
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
ట్రెండింగ్
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!