Weddings Candidates: ఓటర్ల టైం.. పిలవని పేరంటానికైనా నాయకులు పోవాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Weddings Candidates: పెళ్లిళ్లంటే హడావుడి మామూలుగా ఉండదు. వాళ్లకు ఉన్న స్థాయిని బట్టి పెళ్లికి పెద్దవాళ్లను పిలిచి గ్రాండ్ గా పెళ్లిళ్లు చేస్తుంటారు. అదే రాజకీయ నాయకులు వస్తే ఆ పెళ్లిలో సందడే వేరబ్బా.. మా పెళ్లికి ఫలానా రాజకీయ నాయకుడు వచ్చాడంటూ కొన్నేళ్ల పాటు గొప్పలు చెప్పుకుంటారు. కానీ.. ప్రస్తుతం ట్రెండ్ మారింది. పెళ్లిళ్లకు నాయకులు వెళ్లడం తగ్గిపోయింది. తెలిసిన వాళ్లు , బంధువులు పిలిచిన పేరంటాలకు, పెళ్లిళ్లకు నాయకులు వెళ్లడం మానేశారు. కానీ.. ఇప్పుడు ఎలక్షన్స్ సీజన్ ఓటరే ఇప్పుడు వారికి బాస్ అయిపోయాడు. తనకు ఓటు వేయాలంటే నాయకుడు ఓటరు దగ్గరకు వెళ్లాల్సిందే. పిలవని పేరంటమైనా హాజరవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. ఇంటింటికి వెళ్లి ఓటువేయాలని అడగాల్సిన పరిస్థితి ఏమోగానీ పేరంటమైనా.. పెళ్లైనా నాయకులు హాజరు అయితే అక్కడే వందల మందిని ఒకే సారి కలిసే వీలు కూడా ఉంటుంది. ఇన్ని రోజులు పేరంటాలకు రావాలని, పెళ్లిళ్లకు హాజరు కావాలని నాయకుల ఇంటికి వెళ్లి పిలిచినా బిజీ బిజీగా గడిపిన నాయకులు ఇప్పుడు ఓటు కోసం తగ్గాల్సిన పరిస్థితి దాపురిచింది. దీంతో అటు సభలు, సమావేశాల్లో పాల్గొంటూ ప్రచారం చేసుకుంటూనే.. ఇటు పెళ్లిళ్లు, పేరంటాలకు కూడా హాజరవుతున్నారు నాయకులు. అయితే మరోవైపు ఎన్నికల వేళ పెళ్లిళ్ల రద్దీతో రాజకీయ పార్టీలను కలవరపెడుతోంది. వివాహానికి కార్తీకమాసం ఉత్తమమని పండితులు చెబుతున్నారు. ఈ నెల 16, 19, 21, 22, 23, 24, 26, 29 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి.
ఆ తరువాత డిసెంబర్ నెలాఖరులో ఉంటాయి. ఈ తేదీల్లో జంటనగరాల్లో 50 వేల నుంచి లక్షకు పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 30న శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. అంటే ఓటు వేయడానికి 10 రోజుల ముందు వివాహ వేడుకలు ప్రారంభమవుతాయి. అభ్యర్థుల ప్రచారం, పెళ్లిళ్లు ఒకేసారి జరగనుండటంతో రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు మండపాలలో సందడి చేయనున్నారు. అంతకుముందు ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వార్తాపత్రికలు అందజేసి పెళ్లికి రావాలని పదే పదే అడిగేవారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నందున ఆహ్వానం అందని అభ్యర్థులు కూడా కళ్యాణ మండపాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నెల 29న జరిగే వివాహాలు ఓటింగ్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే పెళ్లి కోసం దూర ప్రాంతాలకు వెళ్లే వారిని ఎలా ఆకర్షించాలనేది అభ్యర్థులకు ప్రశ్నగా మారింది. పెళ్లయిన మరుసటి రోజు తీసుకువస్తేనే ఓటు వేయగలరు. కావున ద్వితీయ శ్రేణి నాయకులు వాటిపై దృష్టి సారించి జాగ్రత్తగా ఉండాలని పోటీలో పాల్గొనే అభ్యర్థులు సూచిస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా పోలింగ్ రోజు వచ్చేలా చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదైతేనేం పెళ్లిళ్లలకు అయితే రాజకీయ నాయకులు హాజరు అయ్యేందుకు సిద్దమయ్యారు కానీ.. మరి ఓటరును మళ్లీ ఇక్కడకు రప్పించి ఎలా ఓటు వేయించాలనే ఆలోచనలో పడ్డారు.
Virat Kohli: నువ్ మగాడివిరా బుజ్జి.. క్రికెట్ దిగ్గజం సచిన్కే సాధ్యం కాలేదు!
Also Read
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!