Atchannaidu: ప్రభుత్వం మీద తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు.. అచ్చెన్నాయుడు వార్నింగ్..
- రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేసాం
- అన్న క్యాంటీన్లు పెట్టాం
- మహిళాలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం
- రానున్న రోజుల్లో ముందే అకౌంట్ లో డబ్బులు వేసేస్తాం
- మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన హామీలు అమలు చేయడం లేదంటూ గుడ్డిగా మాట్లాడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ. 3000 పెన్షన్ రూ. 4000 చేశామని తెలిపారు. అన్న క్యాంటీన్లు పెట్టామని.. మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. రానున్న రోజుల్లో ముందే అకౌంట్ లో డబ్బులు వేసేస్తామని స్పష్టం చేశారు. తల్లికి వందనం విషయం లో ప్రతిపక్షం నిద్రపోతున్నట్టు నటిస్తున్నారని విమర్శించారు. మీరు ఇచ్చిన జీవో ప్రకారమే 2000 రూపాయిలు స్కూల్ అభివృద్ధికి వినియోగిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం మీద తప్పుడు సమాచారం ఇచ్చినా , తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తల్లికి వందనం 2000 రూపాయలు లోకేష్ జాబులోకి వెళ్లాయని తప్పుడు విమర్శలు చేశారని చెప్పారు. తల్లికి వందనం డబ్బులు నాకు వచ్చినట్లు నిరూపిస్తే రాజకీయం నుంచి తప్పుకుంటాను అని నారా లోకేష్ చాలెంజ్ చేస్తే ఉలుకు పలుకు లేకుండా ఉన్నారని మండిపడ్డారు.
READ MORE: Union Minister Piyush Goyal: పొగాకు రైతుల పిల్లలకు జపనీస్, జర్మన్, చైనా భాషలను నేర్పుతాం..
Also Read
- AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
- Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
- School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి సంబంధం లేదని.. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మొత్తం డబ్బు అమరావతికి పెట్టేస్తున్నారని కొంతమంది పిచ్చోలు తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సింగిల్ పైసా పెట్టడం లేదని.. రైతులు ఇచ్చి 34 వేల ఎకరాల భూమి ప్రభుత్వం వాడుకోగా కొంత పార్ట్ రైతులకు ఇచ్చామని తెలిపారు. మిగిలిన 9 వేల ఎకరాల పై బ్యాంకులో బ్రేడ్జ్ పెట్టి రుణం తీసుకొని అమరావతి నిర్మిస్తున్నామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని అమరావతి నిర్మిస్తామన్నారు. మొత్తం రికార్డులు చూసుకోండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా పెట్టడం లేదని మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎలాంటి పిచ్చి వాళ్లతో సమస్య రాకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చట్టం చేస్తామన్నారు.అమరావతి ఆంద్రప్రదేశ్ రాజధాని అని చట్టం తీసుకు వస్తున్నామని.. మూడు సంవత్సరాల లో అమరావతి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
READ MORE: Upcoming Smartphones: ఈ రెండు చౌకైన 5G ఫోన్లు వచ్చే వారం విడుదల.. కేక పుట్టించే ఫీచర్లు
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!