India Pakistan War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలపై ప్రభావం?
- కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
- అప్రమత్తమైన భారత్
- రేపు దేశంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్
- తెలుగు రాష్ట్రాల్లోని రెండో చోట్ల మాక్ డ్రిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, పాకిస్థాన్ పాలకులు కలవర పాటుకు గురవుతున్నారు. యుద్ధం వచ్చేసిందని, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గంటలు ఘడియలతో సహా యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పేస్తున్నారు. ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణ్వాయుధాలు తమ వద్ద మాత్రమే ఉన్నట్లు ప్రగల్బాలు పోతున్నారు. నిజానికి, భారత దేశం వద్ద పాక్ కంటే శక్తివంతమైన యుధాలు ఉన్నాయి. ఒక్క అణ్వాయుధాలే కాదు, ఆయుధ సంపత్తితో సహా సైనిక సామర్థ్యం, ససిద్ధత విషయంలో భారత దేశం పాక్ కు అందనంత ఎత్తులో ఉంది. కాగా.. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశంలోని అనేక రాష్ట్రాలను రేపు అంటే మే 7న పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. బుధవారం అన్ని రాష్ట్రాల్లో యుద్ధ సైరన్లు మోగుతాయి.
READ MORE: Pakistan: అంతర్జాతీయంగా ఏకాకి, ఛీ కొడుతున్న మిత్రులు.. పహల్గామ్ తర్వాత పాక్ పరిస్థితి..
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
మాక్ డ్రిల్ లో భాగంగా వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగుతాయి. దాడులు జరిగే చోట జనాలు తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన పౌర రక్షణ పద్ధతుల్లో పౌరులు , విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. క్రాష్ బ్లాక్అవుట్ ఏర్పాట్లు చేస్తారు. ఇలా దేశంలోని మొత్తం 244 నగరాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. అదే విధంగా తెలంగాణలోని క్యాపిటల్ సిటీగా ఉన్న హైదరాబాద్లో యుద్ధ సైరన్ మోగుతుంది. రేపు హైదరాబాద్లో సాయంత్రం 4గంటలకు మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.. నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్న డిఫెన్స్ బృందాలు వెల్లడించాయి.. సికింద్రాబాద్, కంచన్బాగ్ డీఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీ, గోల్కొండలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. కాగా.. మాక్ డ్రిల్ నిర్వహించినంత మాత్రనా.. ఈ యుద్ధ ప్రభావం ఈ ప్రాంతాలపై ఉంటుందని చెప్పాలేం! ఎందుకంటే.. ఈ ప్రాంతాలు పాకిస్థాన్ బార్డర్కి వేల కిలోమీటర్ల లోపల ఉంది.
READ MORE: Moto g56 5G: 6.72 అంగుళాల డిస్ప్లే, 5200mAh బ్యాటరీ, IP69 సర్టిఫికేషన్లతో రాబోతున్న మోటో g56..!
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!