India Pakistan War: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాలపై ప్రభావం?
- కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు
- అప్రమత్తమైన భారత్
- రేపు దేశంలోని పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్
- తెలుగు రాష్ట్రాల్లోని రెండో చోట్ల మాక్ డ్రిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, పాకిస్థాన్ పాలకులు కలవర పాటుకు గురవుతున్నారు. యుద్ధం వచ్చేసిందని, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గంటలు ఘడియలతో సహా యుద్ధం ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పేస్తున్నారు. ముహూర్తాలు పెట్టేస్తున్నారు. అణు హెచ్చరికలు చేస్తున్నారు. అణ్వాయుధాలు తమ వద్ద మాత్రమే ఉన్నట్లు ప్రగల్బాలు పోతున్నారు. నిజానికి, భారత దేశం వద్ద పాక్ కంటే శక్తివంతమైన యుధాలు ఉన్నాయి. ఒక్క అణ్వాయుధాలే కాదు, ఆయుధ సంపత్తితో సహా సైనిక సామర్థ్యం, ససిద్ధత విషయంలో భారత దేశం పాక్ కు అందనంత ఎత్తులో ఉంది. కాగా.. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశంలోని అనేక రాష్ట్రాలను రేపు అంటే మే 7న పౌర రక్షణ మాక్ డ్రిల్ నిర్వహించాలని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. బుధవారం అన్ని రాష్ట్రాల్లో యుద్ధ సైరన్లు మోగుతాయి.
READ MORE: Pakistan: అంతర్జాతీయంగా ఏకాకి, ఛీ కొడుతున్న మిత్రులు.. పహల్గామ్ తర్వాత పాక్ పరిస్థితి..
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
మాక్ డ్రిల్ లో భాగంగా వైమానిక దాడి హెచ్చరిక సైరన్లు మోగుతాయి. దాడులు జరిగే చోట జనాలు తమను తాము రక్షించుకోవడానికి అవసరమైన పౌర రక్షణ పద్ధతుల్లో పౌరులు , విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. క్రాష్ బ్లాక్అవుట్ ఏర్పాట్లు చేస్తారు. ఇలా దేశంలోని మొత్తం 244 నగరాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. అదే విధంగా తెలంగాణలోని క్యాపిటల్ సిటీగా ఉన్న హైదరాబాద్లో యుద్ధ సైరన్ మోగుతుంది. రేపు హైదరాబాద్లో సాయంత్రం 4గంటలకు మాక్ డ్రిల్ నిర్వహిస్తారు.. నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్న డిఫెన్స్ బృందాలు వెల్లడించాయి.. సికింద్రాబాద్, కంచన్బాగ్ డీఆర్డీఓ, మౌలాలి ఎన్ఎఫ్సీ, గోల్కొండలో మాక్ డ్రిల్ నిర్వహిస్తారు. కాగా.. మాక్ డ్రిల్ నిర్వహించినంత మాత్రనా.. ఈ యుద్ధ ప్రభావం ఈ ప్రాంతాలపై ఉంటుందని చెప్పాలేం! ఎందుకంటే.. ఈ ప్రాంతాలు పాకిస్థాన్ బార్డర్కి వేల కిలోమీటర్ల లోపల ఉంది.
READ MORE: Moto g56 5G: 6.72 అంగుళాల డిస్ప్లే, 5200mAh బ్యాటరీ, IP69 సర్టిఫికేషన్లతో రాబోతున్న మోటో g56..!
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!