Vizag: నేడు విశాఖలో నేవీ డే.. ఆర్కే బీచ్ లో ప్రదర్శనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag: భారతదేశం – పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం డిసెంబర్ 4 న నేవీ డే జరుపుకుంటారు. విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఏడాది మైచాంగ్ తుపాను కారణంగా 4వ తేదీన జరగాల్సిన వేడుక 10వ తేదీకి వాయిదా పడింది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఆర్కే బీచ్లో ప్రదర్శనలు ప్రారంభమవుతాయి. నేవీ యుద్ధనౌకలు, ఫైటర్ జెట్లు, జలాంతర్గాములు, హెలికాప్టర్లతో సిబ్బంది విన్యాసాలు చేస్తారు. దాదాపు 2 వేల మంది నౌకాదళ సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొంటారు. వీటిని ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
Read Also:Rajasthan : చండీగఢ్లో గోగమేడి హత్యకేసు.. నిందితుల అరెస్టు
Also Read
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
ఈ ఏడాది నేవీ డేకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని ఒంటిగంటకు పోర్టు గెస్ట్హౌస్కు చేరుకుంటారు. సాయంత్రం 4.15 గంటలకు నేవీ వ్యాయామాలకు హాజరవుతారు. సాయంత్రం 5.35 గంటల వరకు అక్కడే ఉండి, ఆ తర్వాత నేవీ హౌస్లో ‘ఎట్ హోమ్’ పేరుతో ఈస్టర్న్ నేవల్ కమాండ్ (ఈఎన్సీ) వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీ పార్టీకి హాజరవుతారు. రాత్రికి తిరిగి రాజ్భవన్కు చేరుకుంటారు.
Read Also:Fire Accident: బరేలీ-నైనిటాల్ హైవేపై పెను ప్రమాదం.. కారు, ట్రక్కు ఢీకొని 8 మంది సజీవ దహనం
తాజావార్తలు
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!