CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: విశాఖ మహానగరంలో తీవ్ర తాగునీటి సంక్షోభం కొనసాగుతోంది. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా నీటి ఎద్దడి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్ డేంజర్ మార్క్ను దాటడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నగరంలో నీటి సమస్య తీవ్రంగా మారింది. గ్రేటర్ విశాఖ పరిధిలో సుమారు 24 లక్షల మంది ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందించడం జీవీఎంసీకి సవాల్గా మారింది. చాలీచాలని నీటి సరఫరాతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలోనూ తాగునీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
కొన్ని ప్రాంతాల్లో కుళాయి నీరు పది నిమిషాలు కూడా రావడం లేదని స్థానికులు చెబుతున్నారు. అదీ నిర్దిష్ట సమయానికి కాకుండా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో సరైన వర్షాలు లేకపోవడంతో బోర్లు కూడా ఎండిపోయాయని స్థానికులు చెబుతున్నారు. గ్రేటర్ విశాఖలోని ఆరు నియోజకవర్గాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా ఉందని.. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ ఉత్తర నియోజకవర్గంలోనూ తాగునీటి కొరత వేధిస్తోందని పేర్కొన్నారు. దీనితో వెంటనే నీటి సరఫరాను మెరుగుపరచాలని సీఎం చంద్రబాబును ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
- Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా "కరివేపాకు కారప్పొడి" కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు తాగునీటి సమస్యపై స్పందించారు. ఈ ఏడాది నీటి కొరత ఉందని అంగీకరించిన ఆయన.. వచ్చే ఏడాది నుంచి విశాఖ నగరానికి నీటి కొరత లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. మరోవైపు చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఏడాది విశాఖ ప్రజలకు తాగునీరు అందించలేమని ప్రభుత్వం చెబితే.. అసలు ప్రభుత్వం ఎందుకు ఉందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. పెద్ద నగరంలో కనీసం తాగునీరు కూడా సరఫరా చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆయన విమర్శించారు. వర్షాకాలంలోనూ విశాఖలో ఈ స్థాయిలో నీటి సంక్షోభం ఎప్పుడూ చూడలేదని వైసీపీ నేతలు, నగరవాసులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!