Vizag Danger Climate : హీట్ ఐలాండ్ ను తలపిస్తున్న విశాఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఈ క్రమంలో ఏపీ వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం, మంగళవారం ఏపీలోని పలు మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు ఉంటాయని.. ప్రజలను హెచ్చరించింది. ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలి.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది.
Read Also : Ladakh shut down: లడఖ్ లో సంపూర్ణ బంద్.. దలైలామాకు సంఘీభావంగా నిరసన..
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
అయితే విశాఖ నగరంపై ఉప్పు మేఘం కమ్మేసింది. కోస్టల్ బ్యాటరీ నుంచి వైఎంసీఏ వరకు దట్టమైన తేమ గాలులు అల్లుముకున్నాయి. ఎటు చూసినా ఇదే వాతావరణం కనిపిస్తోంది. దీనికి సముద్ర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడమే కారణం అంటున్నారు నిపుణులు. ఏటా మే నెల మధ్యలో ఇటువంటి వాతావరణం వుంటుంది. అయితే, ఉత్తరాంధ్రలో ప్రస్తుతం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. విశాఖ నగరం పగలంతా హీట్ ఐలాండ్ ను తలపిస్తోంది. ఉదయం, సాయంత్ర దట్టమైన తేమగాలులు వీస్తున్నాయి. ఇది అసాధారణమైన పరిణామం కాకపోయినప్పటికీ సమ్మర్ తీవ్రత ఎంత స్థాయిలో పెరిగిందో గుర్తించవచ్చంటున్నారు వాతావరణ నిపుణులు. ఈ ఏడాది ఎలినినో కండిషన్స్ వస్తాయనే అంచనాలకు తగ్గట్టుగానే తీవ్ర ఎండలు, ఉక్కపోతలు ఇబ్బంది కరంగా మారాయి.
Read Also : Kishan Reddy : కేంద్ర అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు తెలియాలి
దీంతో విశాఖ వాసులు అధికంగా నమోదవుతున్న ఎండలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 11 దాటితే ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అవసరమయితేనే బయటకు వస్తున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు.. పగలు ఎండలు, రాత్రి తేమగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?