ViRosh: టాలీవుడ్ ప్రేమజంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అనంతరం తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చారు. గురువారం (ఫిబ్రవరి 26)న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత కేవలం 24 గంటలు గడవకముందే ఈ జంట ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్లో కలిసి కనిపించడంతో అభిమానులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు.
Arshdeep Singh: బుమ్రా రికార్డుకు చెక్ మెట్ పెట్టిన అర్ష్దీప్ సింగ్.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు!
ఎయిర్పోర్ట్కు చేరుకున్న విజయ్–రష్మిక జంట చేతులు పట్టుకుని చిరునవ్వులతో అభిమానులకు అభివాదం చేశారు. నమస్కారం చేస్తూ, చేతులు ఊపుతూ అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొన్నేళ్లుగా వీరి సంబంధంపై అనేక ఊహాగానాలు వినిపించాయి. అభిమానులు ప్రేమగా “విరోష్” అని పిలిచే ఈ జంట దాదాపు ఎనిమిదేళ్లుగా కొనసాగిన అనుబంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. తెలుగు హిందూ, కొడవ సంప్రదాయాల ప్రకారం వారి వివాహ వేడుక జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు.
Kavitha : కేటీఆర్ పై కవిత ఫైర్.. పార్టీ ఓటమిని నా మెడకు చుడతారా..?
ఈ వేడుకలలో రష్మిక సంప్రదాయ ఎరుపు దుస్తుల్లో కొత్త పెళ్లికూతురి మెరుపుతో కనిపించగా.. విజయ్ క్లాసిక్ కుర్తా సెట్లో ఆకట్టుకున్నారు. వివాహానంతరం మార్చి 4న హైదరాబాద్ లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొననున్నారని తెలుస్తోంది.
