ఏపీలో వర్జీనియా పొగాకు ధర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సాగు మొదలుపెట్టిన 75 ఏళ్ల చరిత్రలోనే అత్యధిక ధరలు నమోదవుతున్నాయి. ఇటీవల ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వేలం కేంద్రంలో అత్యధికంగా రూ.254 పలకగా, నిన్న దేవరపల్లిలో రూ.280 ధరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. గోపాలపురంలో రూ.279, కొయ్యలగూడెంలో రూ.277 ధర పలికింది. ఎగుమతులకు డిమాండ్ ఉండటంతో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
Also Read : Maruti Suzuki WagonR CNG Price: 80 వేలకే మారుతీ వేగనార్ సీఎన్జీ.. 34 కిలోమీటర్ల మైలేజ్!
పెరిగిన పెట్టుబడుల దృష్ట్యా అత్యధిక ధర కన్నా సగటు ధర అనుకున్న స్థాయిలో వస్తేనే లాభపడతామనే ఆశతో రైతులు ఉన్నారు. సగటు ధర రూ.200 పైబడి వస్తే గిట్టుబాటు అవుతుందని ఆశించారు. గతంలో సగటు ధర కిలోకు రూ.170, రూ.180, రూ.190గా ఉండేది. అయితే కొద్దిరోజులుగా గ్రేడ్-1 పొగాకుకు ధర పెరగడంతో సగటు ధర కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో ఎన్ఎల్ఎస్ పరిధిలో సగటు ధర రూ.200 మార్కును దాటి ప్రస్తుతం ఇది రూ.209గా కొనసాగుతోంది. ఇదే పంథా కొనసాగితే సగటు ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతులు ఆశిస్తున్నారు.
Also Read : Maruti Suzuki WagonR CNG Price: 80 వేలకే మారుతీ వేగనార్ సీఎన్జీ.. 34 కిలోమీటర్ల మైలేజ్!