Virat Kohli: ఎవరయ్యా ఫాంలో లేరన్నది.. సెంచరీతో మోత మోగించిన కోహ్లీ
- భారత్- పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్
- టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం
- ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్- పాక్ మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 242 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 45 బంతులు ఉండగానే పూర్తి చేసింది. ఈ మ్యాచ్లో ఫోర్ కొట్టి టీమిండియాకు మర్చిపోలేని విక్టరీని అందించాడు విరాట్ కోహ్లీ. ఈ లెజెండరీ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ క్రీజులో అడుగు పెట్టిన దగ్గర్నుంచి పాక్ బౌలర్లను చీల్చి చెండాడాడు. దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో పాకిస్తాన్పై అద్భుతంగా ఆడాడు. కోహ్లీ పాకిస్తాన్పై సెంచరీ పూర్తి చేయడమే కాకుండా.. పాకిస్తాన్పై ఐసీసీ వన్డే టోర్నమెంట్లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా రికార్డు నెలకొల్పాడు. ఈ విషయంలో అతను భారత కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు. అంతే కాకుండా.. ఈ మ్యాచ్లో కోహ్లీ చాలా రికార్డులు సృష్టించాడు.
Read Also: IND vs PAK: క్రేజ్ అంటే ఇదేరా.. పెళ్లి వేడుకలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ లైవ్
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
రోహిత్ శర్మను అధిగమించిన కోహ్లీ
పాకిస్తాన్పై అర్ధ సెంచరీతో విరాట్ కోహ్లీ అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. పాకిస్తాన్పై ఐసీసీ వన్డే టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్మన్గా నిలిచాడు. కోహ్లీ 9 ఇన్నింగ్స్లలో 400* పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 7 ఇన్నింగ్స్లలో 370 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 6 ఇన్నింగ్స్లలో 321 పరుగులు, రాహుల్ ద్రవిడ్ 4 ఇన్నింగ్స్లలో 248 పరుగులు, శిఖర్ ధావన్ 4 ఇన్నింగ్స్లలో 210 పరుగులు, సురేష్ రైనా 3 ఇన్నింగ్స్లలో 156 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ వన్డేల్లో తన 287వ ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్తాన్తో జరిగిన 17 వన్డే ఇన్నింగ్స్లలో 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు. మొత్తం మీద వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ 51 సెంచరీలు చేశాడు. అందులో 74 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అతని స్ట్రైక్ రేట్ 94 కంటే ఎక్కువగా నమోదైంది. బెస్ట్ స్కోర్ 183 పరుగులు.
Read Also: IND vs PAK: సెంచరీతో మెరిసిన విరాట్.. పాకిస్థాన్పై భారత్ ఘన విజయం..
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేసి అందరి నోళ్లు మూయించాడు. గత కొన్ని మ్యాచ్లలో విఫలమైనప్పటికీ.. అతనిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ మ్యాచ్లో సెంచరీ చేసి విమర్శకులు నోళ్లు మూయించాడు. నేను ఫాంలోనే ఉన్నానంటూ మళ్లీ అందరికీ గుర్తు చేశాడు. ఈ సెంచరీతో అభిమానులందరూ ఎంతో ఖుషీ అవుతున్నారు. ఇంకా బోలెడంతా ఫ్యూచర్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!