Virat Kohli: టీంఇండియా సూపర్ స్టార్ బాట్స్మెన్ “విరాట్ కోహ్లీ” గురించి ఏ విషమైన సరే.. క్షణాల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో ‘విరాట్ కోహ్లీ’ సంబంధించి మరోసారి ఓ పెద్ద రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఐపీఎల్ 2026 సీజన్ లో లండన్–బెంగళూరు మధ్య ప్రయాణానికి చార్టర్డ్ ఫ్లైట్స్ ఆర్సీబీ యాజమాన్యానికి హుకుం జారీ చేసినట్లు కొందరు లేనిపోని వార్తలను సృష్టించారు. అయితే తాజాగా ఈ వార్తలపై కోహ్లీ స్పష్టత ఇచ్చాడు.
ఆ పుకారు వార్తలను పూర్తిగా కొట్టిపారేస్తూ.. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రెండు నవ్వుతున్న ఎమోజీలతో చాలా హుందాగా స్పందించాడు. వైరలైన సోషల్ మీడియా పోస్టుల్లో.. ఆర్సీబీ మ్యాచ్ ల మధ్య మూడు రోజుల గ్యాప్ ఉంటే యాజమాన్యాన్నీ చార్టర్డ్ విమానం ఏర్పాటు చేయాలని కోహ్లీ కోరాడని ప్రచారం జరిగింది. ఈ వాదనలన్నీ ఆధారంలేనివని కోహ్లీ రెండు ఎమోజిలతో తేల్చేసాడు. ఈ మధ్యనే లండన్ నుంచి భారత్కు తిరిగివచ్చిన కోహ్లీ.. బెంగళూరులో జట్టు ట్రైనింగ్ క్యాంప్లో చేరాడు. ఎప్పటి లాగే మరోసారి ఐపీఎల్ లో తన మార్క్ బ్యాటింగ్ చూపించేందుకు కఠినంగా మైదానంలో శ్రమిస్తున్నాడు. మార్చి 28న ఐపీఎల్ 2026 మొదటి మ్యాచ్ గా ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
కోహ్లీ లండన్ ప్రయాణాలపై చర్చలు కొత్తవి కావు. కోహ్లీ తన కుటుంబంతో కలిసి కొంత సమయం గడపడానికి లండన్ కు వెళ్తూ.. అక్కడ సాధారణ జీవితం గడపడానికి ఇష్టపడతాడు. అయితే ఈ నిర్ణయంపై కొంతమంది విమర్శలు కూడా వ్యక్తం చేసేవారు లేకపోలేదు. దేశానికి చెందిన ప్రముఖ ఆటగాడు విదేశాల్లో ఎక్కువ సమయం గడపడం సరైనదేనా అనే పలు ప్రశ్నలు సోషల్ మీడియాలో ఎప్పుడునుండో వినిపిస్తున్నాయి.
