Dengue Patient: డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులు బత్తాయి జ్యూస్.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dengue Patient: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఓ కుటుంబం డెంగ్యూ రోగికి ప్లాస్మాకు బదులుగా బత్తాయి జ్యూస్ను స్థానిక బ్లడ్ బ్యాంక్ సరఫరా చేసిందని ఆరోపించింది. దీనిపై విచారణ కూడా జరుగుతున్నట్లు తెలిపింది. బ్లడ్ ప్యాక్లో బత్తాయి జ్యూస్ ఉన్నట్లు చూపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ప్రాంతంలో డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా అవుతున్నట్లు వచ్చిన నివేదికలను పరిశీలించేందుకు దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఇన్స్పెక్టర్ జనరల్ రాకేష్ సింగ్ వెల్లడించారు.
వైరల్ అయిన వీడియోలో ప్రయాగ్రాజ్లోని ఝల్వా ప్రాంతంలో ఉన్న గ్లోబల్ ఆస్పత్రిలో స్కాం జరుగుతోందని ఓ వ్యక్తి తెలిపాడు.
ప్లాస్మా అవసరమైన రోగులకు బత్తాయి జ్యూస్ సరఫరా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ వీడియోలో కనిపించిన బ్లడ్ ప్యాక్లో బత్తాయి జ్యూస్ను పోలిన ద్రవం కనిపించింది. ఈ కారణంగానే డెంగ్యూ బారినపడిన రోగి చనిపోయాడని, ఆస్పత్రిపై చర్య తీసుకోవాలని ప్రయాగ్రాజ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నానని ట్వీట్లో పేర్కొన్నారు.
Also Read
- SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
- China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
Exam Chit Took Boys Life: పరీక్ష చిట్టీని లవ్ లెటర్ అనుకున్న అమ్మాయి.. బాలుడి హత్య
ఈ వైరల్ వీడియోపై యూపీ ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ స్పందించారు. తాము ఓ బృందాన్ని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. గంటల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించామన్నారు. నిరూపితమైతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు, డెంగ్యూ రోగులకు నకిలీ ప్లాస్మా సరఫరా చేయబడుతుందనే నివేదికలను పరిశీలించడానికి దర్యాప్తు బృందం ఏర్పాటు చేయబడిందని ఐజీ రాకేష్ సింగ్ అన్నారు. కొంత మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. జ్యూస్ సరఫరా చేయబడిందా అనే దానిపై ఇంకా క్లారిటీ లేదన్నారు.
प्रयागराज में मानवता शर्मसार हो गयी।
एक परिवार ने आरोप लगाया है कि झलवा स्थित ग्लोबल हॉस्पिटल ने डेंगू के मरीज प्रदीप पांडेय को प्लेटलेट्स की जगह मोसम्मी का जूस चढ़ा दिया।
मरीज की मौत हो गयी है।
इस प्रकरण की जाँच कर त्वरित कार्यवाही करें। @prayagraj_pol @igrangealld pic.twitter.com/nOcnF3JcgP
— Vedank Singh (@VedankSingh) October 19, 2022
తాజావార్తలు
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
-
Chanakya Niti: జీవితంలో గెలవాలంటే ‘చాణక్యుడి’ ఈ ఒక్క సూత్రం చాలు.. శత్రువులను కూడా ఈజీగా బురిడీ కొట్టించవచ్చు!
-
China-Pakistan: పాకిస్తాన్తో సంబంధాలకే చైనా ప్రాధాన్యం: జిన్పింగ్.
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Kishan Reddy vs Asaduddin Owaisi: అసదుద్దీన్ వ్యాఖ్యలకు కిషన్ రెడ్డి కౌంటర్.. ప్రజలను తప్పుదారి పట్టించొద్దు..!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!