Madhya Pradesh: ఛాంపియన్స్ ట్రోఫీ విజయోత్సవాల్లో రాళ్ల దాడి.. వాహనాలకు నిప్పు్
- మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని మోహోలో భారీ గందరగోళం
- ఆదివారం రాత్రి టీమిండియా విజయోత్సవాల సందర్భంగా ర్యాలీ
- కొందరు దుండగులు రాళ్ల దాడి
- బైకులు, కార్లను తగలబెట్టిన దుండగులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో గెలిచినందుకు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ క్రమంలో.. మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలోని మోహోలో భారీ గందరగోళం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి విజయోత్సవాల సందర్భంగా జరిగిన ర్యాలీలో కొందరు దుండగులు రాళ్ల దాడి చేసి బైకులు, కార్లను తగలబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్టు చేశారు. వారిలో కొందరిపై జాతీయ భద్రతా చట్టం (NSA) కింద కేసులు నమోదు చేశారు.
Read Also: Minister Kandula Durgesh: రుషికొండ బీచ్లో మళ్లీ బ్లూఫ్లాగ్ జెండాను ఎగరవేస్తాం..
Also Read
- BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
- Tamil Nadu: "విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?" అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
- SIR In Telangana: తెలంగాణలో 73.39 లక్షల ఓట్లు తొలగింపు.. హైదరాబాద్లోనే అత్యధికం..!
- RK Roja: మంత్రి లోకేష్పై రోజా సంచలన ఆరోపణలు..
కాగా.. ఆదివారం రాత్రి నుంచి మోహోలో జిల్లా యంత్రాంగం, పోలీసు బృందాలు మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. దుండగులను నియంత్రించడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.. అంతేకాకుండా కొందరిపై లాఠీ ఛార్జ్ కూడా చేశారు. ఈ సంఘటనలో గాయపడిన కొంతమందిని ఇండోర్లోని ఎంవై ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ మాట్లాడుతూ.. “నిన్నటి సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, మేము సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని నియంత్రించాం. మొదట శాంతి నెలకొల్పడమే మా లక్ష్యం, మేము అందులో విజయం సాధించాము. ప్రస్తుతం, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. 13 మందిని అరెస్టు చేసి, వారిపై NSA చట్టం కింద చర్యలు తీసుకున్నాం” అని తెలిపారు.
Read Also: Posani Krishna Murali: పోసాని క్వాష్ పిటిషన్లపై విచారణ.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించిన సందర్భంగా మోహోలో అభిమానులు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే.. జామా మసీదు సమీపంలో అకస్మాత్తుగా ఒక వర్గం రాళ్ల దాడి ప్రారంభించింది. ఆ తర్వాత రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్ల దాడితో పాటు కొన్ని వాహనాలకు నిప్పటించారు. పోలీసులు అక్కడున్న సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తుల బృందం ముఖానికి ముసుగులు ధరించి, కర్రలు పట్టుకుని రాళ్ళు విసురుతూ కనిపించింది.
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..