Railway: వేగ పరిమితి ఉల్లంఘన.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ సస్పెండ్
- వేగ పరిమితి ఉల్లంఘించిన సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ లోకో పైలట్.. అసిస్టెంట్ లోకో పైలట్
- వారిని సస్పెండ్ చేసిన రైల్వే అధికారులు
- లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలని ఆర్డర్
- అది మరిచిపోయి పూర్తి వేగంతో రైలును నడిపిన లోకో పైలట్.
కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ ను రైల్వే అధికారులు సస్పెండ్ చేశారు. వేగ పరిమితిని ఉల్లంఘించి వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేసారు. ఆగ్రా రైల్వే డివిజన్లోని మధుర రైల్వే డివిజన్కు చెందిన లోకో పైలట్ గంటకు 20 కి.మీ వేగంతో రైలును నడపాలన్న ఆర్డర్ను మరచిపోయాడు. ఈ రైల్వే విభాగంలో అతను పూర్తి వేగంతో రైలును నడపాడు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఇద్దరు లోకో పైలట్లను సస్పెండ్ చేశారు.
Read Also: Karnataka: రామనగర్ జిల్లా పేరు మార్పునకు కేబినెట్ నిర్ణయం.. కొత్త పేరు ఇదే!
Also Read
సమాచారం ప్రకారం.. రైల్వే ట్రాక్, ట్రాక్ మరమ్మతులు, పాత రైల్వే వంతెన.. స్టేషన్ యార్డ్ పునర్నిర్మాణం యొక్క పరిస్థితి కోసం మథుర రైల్వే సెక్షన్లో రైల్వే వేగ నియంత్రణను విధించింది. ఈ క్రమంలో.. రైలు గంటకు 20 కి.మీ వేగంతో ఈ ట్రాక్ గుండా వెళ్లాల్సి ఉంది. కాగా.. కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని లోకో పైలట్ వేగ పరిమితిని మర్చిపోయాడు. అతను ట్రాక్పై పూర్తి వేగంతో రైలును దాటాడు. దీంతో రైలులో ప్రయాణిస్తున్న వేలాది మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఆగ్రా డివిజన్కు చెందిన పిఆర్ఓ ప్రశస్తి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. విషయం గురించి సమాచారం అందుకున్న తరువాత.. ఇద్దరు లోకో పైలట్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇద్దరినీ తక్షణమే సస్పెండ్ చేశామన్నారు.
Read Also: Renu Desai: మంత్రి కొండా సురేఖను కలిసిన ప్రముఖ సినీ నటి రేణు దేశాయ్
ఆగ్రా రైల్వే డివిజన్లో గత రెండు నెలల్లో మూడోసారి ఈ ఘటన చోటుచేసుకుంది. అంతకుముందు 2024 మేలో.. మాల్వా మరియు గతిమాన్ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు ఆగ్రా రైల్వే సెక్షన్లోనే వేగ పరిమితిని ఉల్లంఘించారు. డ్రైవర్ల పరిమితి గంటకు 20 కి.మీ కాకుండా, రైలు గంటకు 120 కి.మీ వేగంతో నడిపారు. కాగా.. లోకో పైలట్లు కొంత ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆగ్రా రైల్వే డివిజన్లో పదేపదే జరుగుతున్న ఇలాంటి ఘటనలను బట్టి స్పష్టమవుతోంది. ఈ నిరంతర పొరపాటు వల్ల ఏదైనా పెద్ద ప్రమాదం జరగకముందే రైల్వే బోర్డు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుని విచారణ బృందాన్ని పంపాలని రైల్వే అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
West Bengal polls: బీజేపీ గుర్తుపై టేపులు.. రీపోలింగ్కు ఆదేశం..
-
MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
-
PM Modi: ఐదు రాష్ట్రాల్లో బీజేపీ విజయం ఖాయం.. మే 4న ఫలితాలు చరిత్ర సృష్టిస్తాయ్
-
Telangana SSC Results 2026: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల.. లింక్ ఇదిగో..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో